రాయచోటి అర్బన్ : టెక్నికల్ ఫెస్ట్లలో పాల్గొని వివిధ అంశాలపై అవగాహన ల్పించుకోవడం ద్వారా కమ్యూనికేషన్ స్కిల్స్పై పట్టు సాధించవచ్చని కలికిరి జేఎన్టీయూ ఎలక్ట్రానిక్ సెమీ కమ్యూనికేషన్ ఇంజినీరింగ్ విభాగాధిపతి కె.అపర్ణ అన్నారు. గురువారం స్థానిక సాయి ఇంజినీరింగ్ కళాశాలలో నేషనల్ లెవల్ టెక్నికల్ ఫెస్ట్ సాయినైపుణ్య –2కె25ను నిర్వహించా రు. సదస్సులో ఉమ్మడి కడప, చిత్తూరు జిల్లాలకు చెందిన 172 మంది విద్యార్థులు పాల్గొన్నారు. ముఖ్య అతిథిగా హాజరైన ఆమె మాట్లాడుతూ విద్యార్థులు ప్రణాళికాబద్ధంగా చదవాలన్నారు. వివిధ కళాశాలలు నిర్వహించే వర్క్షాపులు, సెమినార్, వెబినార్లు, టెక్నికల్ క్విజ్ వంటి అంశాల పోటీలలో పాల్గొనాలన్నారు. తద్వారా ఆత్మన్యూనత భావం తొలగి ఉద్యోగ, ఉపాధి అవకాశాలను మెరుగుపరచుకోవచ్చన్నారు. అనంతరం ఈ సింపోజియంలో పాల్గొని ప్రతిభ ప్రదర్శించిన విద్యార్థులకు ప్రశంసాపత్రాలు, జ్ఞాపికలను అందజేశారు.కార్యక్రమంలో కళాశాల ఏడీ సుధాకరరెడ్డి, అసిస్టెంట్ ప్రొఫెసర్ బాలచంద్ర, ప్రొఫెసర్ వెంకటరమణ, వివిధ కళాశాలల విభాగాల అధిపతులు, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.
అవగాహనతోనే కమ్యూనికేషన్ స్కిల్స్పై పట్టు