మల్లూరమ్మ తిరునాల ప్రారంభం | - | Sakshi
Sakshi News home page

మల్లూరమ్మ తిరునాల ప్రారంభం

Mar 14 2025 12:06 AM | Updated on Mar 14 2025 12:06 AM

మల్లూ

మల్లూరమ్మ తిరునాల ప్రారంభం

చిన్నమండెం: మండల పరిధిలోని మల్లూరు కొత్తపల్లె గ్రామాల్లో వెలసిన శ్రీ మల్లూరమ్మ తల్లి తిరునాల గురువారం వైభవంగా ప్రారంభమైంది. అమ్మవారిని తిమ్మారెడ్డిగారిపల్లె నుంచి మంగళవాయిద్యాలతో ఆలయం వద్దకు పల్లకీలో తీసుకువచ్చారు. గురువారం ఉదయం అమ్మవారికి సిద్దలపూజ జరిపారు. సంతానం లేని వారు అమ్మవారికి వరపడ్డారు.మల్లూరమ్మ తల్లికి మంత్రి మండిపల్లి రాంప్రసాద్‌రెడ్డి పట్టు వస్త్రాలు సమర్పించారు. భక్తులు అధిక సంఖ్యలో అమ్మవారిని దర్శించుకున్నారు. రాయచోటి డీఎస్పీ కొండయ్యనాయుడు ఆధ్వర్యంలో రూరల్‌ సీఐ వరప్రసాద్‌ పర్యవేక్షణలో నలుగురు సీఐలు, 10 మంది ఎస్‌ఐలు, 250 పోలీసులతో బందోబస్తు నిర్వహించారు. ఈ సందర్భంగా మొక్కులు తీరిన భక్తులు అమ్మవారికి 22 చాందినీబండ్లు ఏర్పాటు చేశారు. వీటిని ఊరేగింపుగా తీసుకొచ్చారు.

మల్లూరమ్మ తిరునాల ప్రారంభం 1
1/2

మల్లూరమ్మ తిరునాల ప్రారంభం

మల్లూరమ్మ తిరునాల ప్రారంభం 2
2/2

మల్లూరమ్మ తిరునాల ప్రారంభం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement