
21న జెడ్పీ స్థాయీ సంఘ సమావేశాలు
కడప సెవెన్రోడ్స్: జిల్లా పరిషత్ స్థాయీ సంఘ సమావేశాలు ఈనెల 21వ తేది జిల్లా పరిషత్ కార్యాలయంలో నిర్వహించనున్నట్లు జిల్లా పరిషత్ ముఖ్య నిర్వాహణాఽధికారి ఓబులమ్మ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సమావేశాలకు ఉమ్మడి వైఎస్సార్ జిల్లా పరిషత్ ప్రాదేశిక నియోజకవర్గ సభ్యులు, ఇరు జిల్లాల అధికారులు హాజరు కావాలని ఆమె కోరారు.
17న చలో విజయవాడ
మదనపల్లె సిటీ: పంచాయతీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఈనెల 17వతేదీన సీఐటీయూ ఆధ్వర్యంలో చలో విజయవాడ కార్యక్రమం జరగనుంది. దీనిని జయప్రదం చేయాలని గ్రామ పంచాయతీ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు వెంకట్రామయ్య కోరారు. గురువారం మదనపల్లె డీఎల్పీఓ కార్యాలయం వద్ద దీనికి సంబంధించిన కరపత్రాలను ఆవిష్కరించారు. రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీల మేరకు వేతనాలు పెంచాలని, కోర్టు తీర్పు ప్రకారం జిల్లాలోని అందరినీ పర్మినెంట్ చేయాలని డిమాండ్ చేశారు. కొన్ని చోట్ల జరుగుతున్న అక్రమాలను అరికట్టాలన్నారు. అనంతరం డీఎల్పీఓ నాగరాజుకు వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో నాయకులు గోపాల్,రవి, శీను, రాజు, ఆనంద తదితరులు పాల్గొన్నారు.
వెబ్ ఆప్షన్లు పూర్తి చేయండి
కడప రూరల్: ఎస్సీ, ఎస్టీ అభ్యర్ధుల డీఎస్సీ ఉచిత కోచింగ్కు సంబంధించి వెబ్ ఆప్షన్లను పూర్తి చేయాలని వైఎస్సార్ జిల్లా సాంఘిక సంక్షేమ శాఖ డిప్యూటీ డైరెక్టర్ సరస్వతి తెలిపారు. ఇందుకు సంబంధించి జ్ఞానభూమి వెబ్ ఆప్షన్ సర్వీస్ ప్రారంభమైందన్నారు. ఇప్పటికే 1000 మంది షార్ట్ లిస్ట్ చేసిన అభ్యర్ధులుతమ వెబ్ ఆప్షన్లను పూర్తి చేశారని తెలిపారు. షార్ట్ లిస్ట్ చేసిన అభ్యర్ధులందరూ సకాలంలో వారి వెబ్ ఆప్షన్లను పూర్తి చేయాలని తెలిపారు. షార్ట్ లిస్ట్ చేసిన అభ్యర్ధులు 15న లేదా అంతకుముందు వెబ్ ఆప్షన్ సర్వీస్ ద్వారా ఎంప్యానెల్డ్ కోచింగ్ సంస్ధలకు తమ ప్రాధాన్యతలను తెలియజేయాలని పేర్కొన్నారు. షార్ట్ లిస్ట్ చేసిన అభ్యర్థుల జాబితాను ఏపీసీఎఫ్ఎస్ఎస్ వెబ్ పోర్టల్లో చూడవచ్చని తెలిపారు.
15న బద్వేలులో జాబ్మేళా
కడప కోటిరెడ్డిసర్కిల్: జిల్లా ఉపాధి కార్యాలయం, జిల్లా నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో ఈనెల 15న ఉదయం 10 గంటలకు వైఎస్ఆర్ జిల్లా బద్వేలులోని తహసీల్దార్ కార్యాలయ సమీపంలోని వెలుగు కార్యాలయంలో జాబ్మేళా నిర్వహించనున్నట్లు జిల్లా ఉపాధి కల్పనాధికారి సురేష్కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. పేటీఎం కంపెనీలో ఫీల్డ్ సేల్స్ ఎగ్జిక్యూటివ్, డొనో బీపీఓ అండ్ ఐటీ సొల్యూషన్ ప్రైవేటు లిమిటెడ్ కంపెనీలో టెలీ కాలింగ్ ఆఫీసర్, ఆల్ డిక్సన్ కంపెనీలో అసెంబ్లింగ్ ఆపరేటర్, క్వాలిటీ ఉద్యోగాలకు ఇంటర్వ్యూలు ఉంటాయన్నారు. అభ్యర్థులు టెన్త్, ఇంటర్, డిగ్రీ, పీజీ చదివి 18–45 సంవత్సరాల మధ్య వయస్సు కలిగి ఉండాలన్నారు. ఎంపికై న వారికి అర్హతను, అనుభవాన్ని బట్టి రూ. 12–25 వేల వరకు వేతనం ఉంటుందన్నారు. అభ్యర్థులు విద్యార్హతలు, ఫోటోలతో ఇంటర్వ్యూకు హాజరు కావాల్సి ఉంటుందన్నారు.
అవసరమైనప్పుడు
పోలీసులను ఆశ్రయించండి
రాయచోటి జగదాంబసెంటర్/ అర్బన్ : విద్యార్థులు అవసరమైనపుడు పోలీసులను ఆశ్రయించాలని అదనపు ఎస్పీ ఎం.వెంకటాద్రి పేర్కొన్నారు. ఎస్పీ విద్యాసాగర్నాయుడు ఆదేశాల మేరకు జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయంలో 250 మంది స్కౌట్స్ అండ్ గైడ్స్ విద్యార్థిని, విద్యార్థులకు గురువారం పోలీసు అధికారులు ‘ఓపెన్ హౌస్’కార్యక్రమం నిర్వహించారు. విధి నిర్వహణలో పోలీసులు వినియోగిస్తున్న వివిధ రకాల అత్యాధునిక ఆయుధాలు, బాంబ్ డిస్పోజల్ పరికరాల గురించి పోలీసు సిబ్బంది అవగాహన కల్పించారు. మొబైల్ వినియోగం వల్ల కలిగే అనర్థాలు, సైబర్ క్రైమ్, మహిళల స్వీయ రక్షణ, శక్తి యాప్ గురించి, డయల్ 100/112 గురించి, 1098 నంబర్ల గురించి అదనపు ఎస్పీ వివరించారు. ఆర్ఐ, అడ్మిన్ విజె రామకృష్ణ, ఆర్ఎస్ఐలు అమరనాథ్రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

21న జెడ్పీ స్థాయీ సంఘ సమావేశాలు