ఘనంగా వైఎస్సార్‌సీపీ ఆవిర్భావ దినోత్సవం | - | Sakshi
Sakshi News home page

ఘనంగా వైఎస్సార్‌సీపీ ఆవిర్భావ దినోత్సవం

Mar 13 2025 12:42 AM | Updated on Mar 13 2025 12:39 AM

రాయచోటి/రాయచోటి అర్బన్‌: వైఎస్సార్‌సీపీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు జిల్లా వ్యాప్తంగా వైభవంగా జరిగాయి. బుధవారం ఉదయం జిల్లా కేంద్రం రాయచోటితో పాటు జిల్లా పరిధిలోని ఆరు నియోజకవర్గాల పార్టీ కార్యాలయాల ఆవరణాలలో పార్టీ నాయకులు, అభిమానుల నడుమ వేడుకలను నిర్వహించారు. ఈ సందర్భంగా నియోజవర్గ కేంద్రాల్లోని పార్టీ కార్యాలయాల వద్ద ఆ పార్టీ నాయకులు పార్టీ జెండాలను ఆవిష్కరించి, అభిమానుల కోలహాల మధ్య కేకులను కట్‌ చేశారు. వైఎస్సార్‌ ఆశయాల సాధనే లక్ష్యంగా ఆవిర్భవించిన వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీని నాటి నుంచి నేటి వరకు తమ భుజస్కందాలపై మోస్తున్న పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పార్టీ శ్రేణులు ఒకరికి ఒకరు పార్టీ ఆవిర్భావ శుభాకాంక్షలు తెలుపుకున్నారు.

రెపరెపలాడిన పార్టీ జెండా..

వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ 15 ఆవిర్భావ దినోత్సవాలను పురస్కరించుకొని జిల్లాలోని అన్ని నియోజకవర్గ కార్యాలయ ఆవరణాల్లో పార్టీ జెండా రెపరెపలాడింది. రాయచోటి లోని జిల్లా పార్టీ కార్యాలయంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు అమర్నాథ్‌ రెడ్డి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీకాంత్‌ రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు కొరుముట్ల శ్రీనివాసులు, చింతల రామచంద్రారెడ్డిలు కలిసి పార్టీ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గడికోట శ్రీకాంత్‌రెడ్డి, జిల్లా అధ్యక్షుడు ఆకేపాటి అమరనాథరెడ్డి మాట్లాడుతూ పేదల జీవితాల్లో వెలుగులు నింపేందుకే ప్రజాక్షేత్రంలో పురుడుపోసుకున్న పార్టీ వైఎస్‌ఆర్‌సీపీ అని అన్నారు. రాయచోటి నియోజవర్గ పార్టీ కా ర్యాలయంలో మాజీ ఎమ్మెల్యే శ్రీకాంత్‌ రెడ్డి, మున్సిప ల్‌ చైర్మన్‌ ఫయాజ్‌బాషాలతో కలిసి జెండాను ఆవిష్కరించి కేక్‌ కట్‌ చేసి సంబరాలు చేసుకున్నారు. మున్సిపల్‌ వైస్‌ౖచైర్మన్‌ ఫయాజుర్‌ రహిమాన్‌, మాజీ ఎంపిపిలు పోలు సుబ్బారెడ్డి, అంబాబత్తిన రెడ్డెయ్య, ఎంపిపి సుదర్శన్‌రెడ్డి, నేతలు ఆవుల వేణు గోపాల్‌రెడ్డి, యధుభూషణ్‌రెడ్డి, పడమటికోన బాబురెడ్డి, జడ్పిటిసిలు ఎం.వెంకటరమణ, వెంకటేశ్వరరెడ్డి, పల్లపు రమేష్‌, రవిశంకర్‌రెడ్డి, కర్ణపు విశ్వనాథరెడ్డి, కొలిమి హారూన్‌బాష, జిల్లా మైనార్టీ అధ్యక్షుడు బేపారి మహమ్మద్‌ఖాన్‌ పాల్గొన్నారు.

● రాజంపేటలోని పార్టీ భవన్‌లో మున్సిపల్‌ చైర్మన్‌ పోలా శ్రీనివాసులు రెడ్డితో కలిసి ఎమ్మెల్యే అమర్నాథ్‌ రెడ్డి జెండాను ఆవిష్కరించారు.

● కోడూరులోని పార్టీ కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యే కొరముట్ల శ్రీనివాసులు స్థానిక నాయకులతో కలిసి పార్టీ జెండా ఆవిష్కరణ చేసి వేడుకలు నిర్వహించారు.

● తంబళ్ళపల్లి పార్టీ కార్యాలయం లో ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారకనాథ్‌ రెడ్డి స్థానిక నాయకులతో కలిసి పార్టీ జెండాను ఆవిష్కరించారు. అంతకుముందుగా పట్టణ కేంద్రంలోని వైఎస్‌ఆర్‌ విగ్రహానికి పాలాభిషేకం చేసి, పూల దండలతో సత్కరించారు . ఈ సందర్భంగా దివంగత నేతకు నివాళులర్పించారు.

● పీలేరు నియోజకవర్గ పరిధిలోని వాల్మీకిపురం లో ఉన్న పార్టీ కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యే చింతల రామచంద్ర రెడ్డి పార్టీ జెండాను ఆవిష్కరించారు.

● మదనపల్లెలోని వైఎస్సార్సీపీ కార్యాలయంలో నియోజవర్గ పార్టీ ఇన్‌చార్జి నిస్సార్‌ అహ్మద్‌, మున్సిపల్‌ చైర్మన్‌ మనుజా రెడ్డిలతో కలిసి పార్టీ జెండాను ఆవిష్కరించారు.నియోజవర్గ పరిధిలోని రామసముద్రం మండల కేంద్రంలో స్థానిక నాయకులు పార్టీ జెండాను ఆవిష్కరించి వేడుకలను నిర్వహించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement