కర్ణాటక సరిహద్దులో రెండు ప్రైవేట్‌ బస్సులు ఢీ | - | Sakshi
Sakshi News home page

కర్ణాటక సరిహద్దులో రెండు ప్రైవేట్‌ బస్సులు ఢీ

Mar 13 2025 12:38 AM | Updated on Mar 13 2025 12:37 AM

మదనపల్లె : కరకర్ణాటక రాష్ట్ర సరిహద్దు, మదనపల్లెకు సమీపంలో మంగళవారం అర్ధరాత్రి రెండు ప్రైవేట్‌ బస్సులు ఢీకొన్న ప్రమాదంలో ఒకరు మృతి చెందగా, నలుగురి పరిస్థితి విషమంగా ఉంది. ఏడుగురికి తీవ్రగాయాలతో పాటు 40 మంది ప్రయాణికులు స్వల్పంగా గాయపడ్డారు. వైఎస్సార్‌ జిల్లా ప్రొద్దుటూరు నుంచి బెంగళూరుకు వెళుతున్న సువర్ణముఖి(సబర్వాల్‌) ప్రైవేట్‌ బస్సు మదనపల్లె మీదుగా బెంగళూరుకు వెళుతోంది. అదే సమయంలో బెంగళూరు నుంచి నంద్యాలకు వెళుతున్న ఏఆర్‌బీసీవీఆర్‌ ప్రైవేట్‌ ట్రావెల్స్‌ బస్సు కర్ణాటక సరిహద్దు రాయల్పాడు సమీపంలోని గెలిజగూరు వద్ద రాత్రి 1 గంట సమయంలో ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఏఆర్‌ ట్రావెల్స్‌ బస్సు ముందువైపు వెళుతున్న వాహనాలను ఓవర్‌టేక్‌ చేస్తూ, ఎదురుగా వచ్చిన సువర్ణముఖి బస్సును ఢీకొంది. ప్రమాదంలో మదనపల్లె కమ్మవీధికి చెందిన సువర్ణముఖి ప్రైవేట్‌ బస్సు కండక్టర్‌ గంగాధర్‌ అలియాస్‌ బాబు (59) అక్కడికక్కడే దుర్మరణం చెందాడు. డ్రైవర్‌ వెను కసీటులో ఉన్న మరో నలుగురు వ్యక్తులు తీవ్రంగా గా యపడ్డారు. వారి పరిస్థితి విషమంగా ఉండటంతో శ్రీ నివాసపురం ఆస్పత్రికి తరలించారు. 22 మంది ప్ర యాణికులను మదనపల్లె ప్రభుత్వ జిల్లా ఆస్పత్రికి త రలించారు. వారిలో చింతామణికి చెందిన వెంకటేష్‌ (40), కడపకు చెందిన అలీ(38), నంద్యాలకు చెందిన జవహరుద్దీన్‌(35), బెంగళూరుకు చెందిన జయకుమారి(30), ఆనందరెడ్డి(54), రాంప్రసాద్‌(57), రా యచోటికి చెందిన నిర్మల(38) తీవ్రంగా గాయపడగా, మెరుగైన వైద్యం కోసం వారిని తిరుపతి, బెంగళూరు ఆస్పత్రులకు తరలించారు. ప్రమాద సమాచారం తెలుసుకున్న కర్ణాటక రాయల్పాడు పోలీసులు హుటాహుటిన అక్కడికి చేరుకుని క్షతగాత్రులను మదనపల్లె, బెంగళూరు, కోలారు, శ్రీనివాసపురం ఆస్పత్రులకు 108 వాహనాల్లో తరలించారు. ప్రమాదఘటనపై విచారణ చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

ఒకరి మృతి, ఏడుగురికి తీవ్రగాయాలు

నలుగురి పరిస్థితి విషమం

40మంది ప్రయాణికులకు స్వల్పగాయాలు

కర్ణాటక సరిహద్దులో రెండు ప్రైవేట్‌ బస్సులు ఢీ1
1/3

కర్ణాటక సరిహద్దులో రెండు ప్రైవేట్‌ బస్సులు ఢీ

కర్ణాటక సరిహద్దులో రెండు ప్రైవేట్‌ బస్సులు ఢీ2
2/3

కర్ణాటక సరిహద్దులో రెండు ప్రైవేట్‌ బస్సులు ఢీ

కర్ణాటక సరిహద్దులో రెండు ప్రైవేట్‌ బస్సులు ఢీ3
3/3

కర్ణాటక సరిహద్దులో రెండు ప్రైవేట్‌ బస్సులు ఢీ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement