టీడీపీకి గట్టి షాక్‌ | - | Sakshi
Sakshi News home page

టీడీపీకి గట్టి షాక్‌

Mar 19 2024 1:10 AM | Updated on Mar 19 2024 12:03 PM

- - Sakshi

నేడు వైఎస్సార్‌సీపీలోకి రెడ్యం

ఖాజీపేట : తెలుగుదేశం పార్టీ సీనియర్‌ నాయకుడు, కడప రీజినల్‌ మాజీ ఆర్టీసీ డైరెక్టర్‌ రెడ్యం వెంకటసుబ్బారెడ్డి వైఎస్సార్‌ సీపీలో చేరనున్నారు. మైదుకూరులోని డీసీఎల్‌ కల్యాణ మండపంలో 19వ తేదీ సాయంత్రం 4 గంటలకు చేరనున్నారు. ఇందుకోసం ఏర్పాట్లు చేశారు. ఎంపీ వైఎస్‌ అవినాష్‌రెడ్డి, ఎమ్మెల్యే రఘురామిరెడ్డి, ఎమ్మెల్సీలు రామసుబ్బారెడ్డి, రమేష్‌యాదవ్‌, జిల్లా పార్లమెంటరీ వ్యవహారాల ఇన్‌చార్జి సురేష్‌బాబు హజరు అవుతున్నట్లు రెడ్యం సోదరులు తెల్పరు.

ఖాజీపేట మండలంలో 1983 నుంచి టీడీపీ కోసం రెడ్యం సోదరులు పనిచేశారు. పార్టీ ఎదుగుదలకు ఎంతో కృషి చేశారు. వీరు వైఎస్సార్‌ సీపీ లోకి చేరుతుండటంతో టీడీపీకి గట్టి షాక్‌ అని చెప్పవచ్చు. రెడ్యం వెంకటసుబ్బారెడ్డి తోపాటు వారి సోదరులు కేసీకెనాల్‌ డిస్ట్రిబ్యూటరీ కమిటీ మాజీ అధ్యక్షుడు రెండ్యం చంద్రశేఖర్‌రెడ్డి, రెడ్యం ఆదినారాయణరెడ్డి, రెడ్యం రామకృష్ణారెడ్డితో పాటు పలువురు సింగిల్‌ విండో మాజీ అద్యక్షులు రెడ్యం తోపాటు పార్టీలో చేరనున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement