బాలిక అదృశ్యం | - | Sakshi
Sakshi News home page

బాలిక అదృశ్యం

Sep 29 2023 1:52 AM | Updated on Sep 29 2023 1:52 AM

పసుపులేటి శంకర్‌  
 - Sakshi

పసుపులేటి శంకర్‌

ములకలచెరువు : మండలానికి చెందిన ఒక మైనర్‌ బాలిక అదృశ్యమైనట్లు గురువారం కేసు నమోదు చేశారు. ఎస్‌ఐ గాయత్రి కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. మండలంలోని సారగుండ్లపల్లెకు చెందిన మైనల్‌ బాలిక (16) ఇంటి నుంచి పనుల మీద బయటకు వెళ్లింది. రాత్రయినా తిరిగి రాకపోవడంతో కుటుంబ సభ్యులు బంధువులను విచారణ చేసినా ఆచూకీ లభించలేదు. దీంతో తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు ఎస్‌ఐ దర్యాప్తు చేస్తున్నారు.

అఖిల భారతీయ కవి

సమ్మేళనానికి ఆహ్వానం

నందలూరు (రాజంపేట) : నందలూరు వాసి, రాజంపేట సెకండ్‌ క్లాస్‌ న్యాయాధికారి పసుపులేటి శంకర్‌కు ఈ నెల 30వ తేదీ తిరుపతిలో జరగనున్న అఖిల భారతీయ కవి సమ్మేళనకు ఆహ్వానం అందినట్లు గురువారం ఆయన విలేకరులకు తెలిపారు. తిరుపతి నగరం రాష్ట్రీయ సంస్కృత విశ్వవిద్యాలయంలోని చెలికాని అన్నారావు సమావేశ మందిరంలో దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన కవులచే సమ్మేళన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని ఆయన పేర్కొన్నారు. శని, ఆదివారాలలో రెండు రోజుల పాటు సాగే ఈ కార్యక్రమానికి కవులే కాకుండా వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు కూడా హాజరు కానున్నట్లు ఆయన వివరించారు.

నవోదయ విద్యాలయాలకు విశ్వం విద్యార్థుల ఎంపిక

తిరుపతి ఎడ్యుకేషన్‌ : 2023–2024వ విద్యా సంవత్సరానికి జాతీయ స్థాయిలో నిర్వహించిన జవహర్‌ నవోదయ విద్యాలయ ప్రవేశ పరీక్ష ఫలితాల్లో తిరుపతిలోని విశ్వం విద్యార్థులు ప్రతిభ చాటారు. మొదటి జాబితా ఫలితాల్లో 42 మంది, రెండో జాబితా ఫలితాల్లో ఏడుగురు జవహర్‌ నవోదయ విద్యాలయాల్లో సీట్లు సాధించినట్లు ఆ విద్యాసంస్థల అధినేత ఎన్‌.విశ్వనాథరెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. రెండో జాబితాలో ఎన్‌.తనీష్‌, కె.నీలేష్‌ రోషన్‌, వై.ఝాన్సీ, ఓంకార్‌, ఈ.జనిత్‌ ఎంపికై నట్లు పేర్కొన్నారు. వారిని అకడమిక్‌ డైరెక్టర్‌ ఎన్‌.విశ్వచందన్‌రెడ్డి, కరస్పాండెంట్‌ ఎన్‌.తులసి తదితరులు అభినందించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement