సాక్షి, తాడేపల్లి: నేడు హనుమాన్ జయంతి. ఈ సందర్భంగా వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్.. ఆంజనేయ స్వామి జయంతి సందర్భంగా రాష్ట్ర ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలిపారు. వైఎస్ జగన్ ట్విట్టర్ వేదికగా..‘శక్తి, భక్తి, అచంచల విశ్వాసానికి ప్రతిరూపం శ్రీరామ భక్తుడు హనుమాన్. `రామ కార్యమే నా ధర్మం` అని ముందుగా సాగిన అంజనీ పుత్రుడు ఆయన. మనోధైర్యంతోనే ఏ కార్యాన్ని అయినా సాధించవచ్చని హనుమంతుడు చూపిన మార్గం మనకు ఆదర్శం. శ్రీ ఆంజనేయ స్వామి జయంతి సందర్భంగా రాష్ట్ర ప్రజలందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు’ అని పోస్టు చేశారు.
శక్తి, భక్తి, అచంచల విశ్వాసానికి ప్రతిరూపం శ్రీరామ భక్తుడు హనుమాన్. `రామ కార్యమే నా ధర్మం` అని ముందుగా సాగిన అంజనీ పుత్రుడు ఆయన. మనోధైర్యంతోనే ఏ కార్యాన్ని అయినా సాధించవచ్చని హనుమంతుడు చూపిన మార్గం మనకు ఆదర్శం. శ్రీ ఆంజనేయ స్వామి జయంతి సందర్భంగా రాష్ట్ర ప్రజలందరికీ…
— YS Jagan Mohan Reddy (@ysjagan) April 2, 2026


