విషాదం.. ఇద్దరు పిల్లలతో సహా స్క్రూ బ్రిడ్జిలో దూకిన తల్లి | Tragedy At Vijayawada Screw Bridge, A Mother With Her Two Children Jumped Into The Bandar Canal | Sakshi
Sakshi News home page

విజయవాడలో విషాదం.. ఇద్దరు పిల్లలతో సహా స్క్రూ బ్రిడ్జిలో దూకిన తల్లి

Sep 29 2024 4:30 PM | Updated on Sep 29 2024 6:05 PM

Tragedy at Vijayawada Screw Bridge

సాక్షి,విజయవాడ: విజయవాడలో విషాదం చోటు చేసుకుంది. స్క్రూ బ్రిడ్జి వద్ద ఓ తల్లి  తన ఇద్దరు ఆడపిల్లలతో కలిసి బందర్ కాలువలోకి దూకింది.

ఈ ఘటనతో అప్రమత్తమైన స్థానికులు తల్లి,పిల్లల్ని కాపాడేందుకు ప్రయత్నించారు. సంవత్సరంలోపు వయసుగల పసికందును వెలికి తీశారు. అత్యవసర చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు.

అయితే హాస్పటల్‌కు తరలించే లోపే పసికందు మృతి చెందినట్లు తెలుస్తోంది. తల్లి, కుమారుడు కోసం గాలింపు చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి.  
 

Advertisement
 
Advertisement
Advertisement