కరోనాతో కార్పొరేటర్ వానపల్లి రవి మృతి
సాక్షి, విశాఖపట్నం: నగరంలో కరోనా బారినపడి టీడీపీ కార్పొరేటర్ మృత్యువాత పడ్డారు. ఇటీవల జరిగిన జీవీఎంసీ ఎన్నికల్లో 31వ వార్డు కార్పొరేటర్గా ఎన్నికైన వానపల్లి రవి కుమార్.. ఇటీవల కోవిడ్ బారిన పడ్డారు. ఆసుపత్రిలో గత మూడు రోజులుగా చికిత్స పొందుతూ సోమవారం ఉదయం మృతి చెందారు. కార్పొరేటర్గా గెలుపొందిన ఆయన.. అనాథ శవాల అంత్యక్రియలు లాంటి ఎన్నో సామాజిక కార్యకలాపాలు గతంలో నిర్వహించారు.
చదవండి: సాక్షి ఎఫెక్ట్: అక్రమాల కోటలు కూలుతున్నాయ్..
మాయా జలం: మంచి నీటి పేరిట మహా మోసం