భార్య ఫోన్‌ మాట్లాడటం లేదని ఆత్మహత్యాయత్నం

Man Suicide Attempt In East Godavari - Sakshi

కాకినాడ క్రైం: భార్య తనతో ఫోన్‌ మాట్లాడటం లేదని మనస్తాపం చెందిన ఓ భర్త ఆత్మహత్యకు పాల్పడ్డాడు. తాళ్లరేవు మండలం గాడిమొగకు చెందిన పాతికేళ్ల దండుప్రోలు ప్రసాద్‌కు కొన్నాళ్ల క్రితం నూకరత్నంతో వివాహమైంది. ప్రస్తుతం భార్య మూడో నెల గర్భవతి. ఈ నేపథ్యంలో కొద్ది రోజుల క్రితం పుట్టింటికి వెళ్లింది. ప్రతి రోజూ ప్రసాద్‌ పలుమార్లు ఫోన్‌ చేసి తన భార్య బాగోగులు తెలుసుకునేవాడు.

కొద్ది రోజుల నుంచి తనతో భార్య ఫోన్‌ మాట్లాడడం తగ్గించిందని మనస్తాపానికి గురయ్యాడు. ఇదే విషయాన్ని భార్య వద్ద ప్రస్తావించగా.. గర్భవతిని కావడం వల్ల నీరసంగా ఉంటోందని, వైద్యులు సూచన మేరకు ఫోన్‌ మాట్లాడడం తగ్గించానని భర్తకు చెప్పింది. దీంతో మనోవేదనకు గురైన ప్రసాద్‌ శుక్రవారం ఉదయం ఇంట్లో చీమల మందు తిని ఆత్మహత్యకు యత్నించాడు. తల్లి పేరమ్మ చూసి స్థానికుల సాయంతో కాకినాడ జీజీహెచ్‌లో  చేర్చింది. ప్రసాద్‌ ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. 
చదవండి:
నిత్య పెళ్లికొడుకు: ఒకరిద్దరు కాదు.. ఏకంగా 9 మంది..
టెక్కీ‌ భర్త.. కాపురానికి పనికిరాడనే విషయం దాచి

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top