సాక్షి, అమరావతి: టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడి పోరాటం రియల్ ఎస్టేట్ ప్రయోజనాల కోసమేనని మంత్రి కురసాల కన్నబాబు ధ్వజమెత్తారు. అమరావతి ఉద్యమం పేరుతో ప్రజల్ని మభ్యపెడుతున్నారని విమర్శించారు. అమరావతిని ఐదేళ్లూ అభివృద్ధి చేయకుండా గ్రాఫిక్స్తో కాలయాపన చేసి.. ఇప్పుడు అభివృద్ధి వికేంద్రీకరణను తన స్వార్థం కోసం వ్యతిరేకిస్తున్నారని దుయ్యబట్టారు. తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడారు. అమరావతిలో సొంత సంపదకు, తన బినామీల సంపద సృష్టికి ఎక్కడ విఘాతం కలుగుతుందోననేదే చంద్రబాబు భయం అని విమర్శించారు. అమరావతి ఉద్యమం పేరుతో ఆ ప్రాంత ప్రజలను భ్రమల్లో ఉంచి, 600 రోజుల పేరుతో టీడీపీ పండగ చేసుకుంటోందని, ఇకనైనా ఆ భ్రమల్లో నుంచి బాబు బయటకు రావాలని ఆయన హితవు పలికారు. అమరావతి ఆందోళనాకారులపై ఏదో జరిగి పోతోందంటూ ఉదయం నుంచి టీడీపీ, వారికి వత్తాసు పలికే మీడియా గోరంతను కొండంత చేసి చూపించే ప్రయత్నం చేసిందన్నారు. టీడీపీ హయాంలో జరిగినట్టుగా ఈ ప్రభుత్వం ఏ ఒక్కరి మీద దమనకాండ చేయదని స్పష్టం చేశారు. వికేంద్రీకరణకు మద్దతుగా ఉద్యమం చేస్తున్న దళితులను అవమానించినందుకు చంద్రబాబు, టీడీపీ నేతలు బేషరతుగా క్షమాపణ చెప్పాలని మంత్రి డిమాండ్ చేశారు.
సమన్యాయం ప్రభుత్వ లక్ష్యం
వికేంద్రీకరణే ఈ ప్రభుత్వ విధానం అని, అమరావతి అభివృద్ధి కూడా రాష్ట్ర ప్రభుత్వ బాధ్యత అని కన్నబాబు స్పష్టం చేశారు. రాష్ట్రంలో అన్ని ప్రాంతాలకు సమన్యాయం జరగాలని సీఎం జగన్ భావిస్తున్నారని చెప్పారు. చంద్రబాబు స్వార్థంతోనే అభివృద్ధి వికేంద్రీకరణను వ్యతిరేకిస్తున్నారని, ఆయన తప్పిదాల వల్లే దారుణంగా ఓటమి చెందినా బాబుకు, లోకేశ్కు బుద్ధి రాలేదని మండిపడ్డారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో పంచాయతీల నుంచి గుంటూరు, విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల వరకు అన్ని ఎన్నికల్లో టీడీపీ ఘోర పరాజయం చవిచూసినా చంద్రబాబు మైండ్ సెట్ మార్చుకోలేదన్నారు.
అమరావతి టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్న
విశాఖలో పరిపాలన రాజధాని వస్తే ఉత్తరాంధ్ర అభివృద్ధి చెందుతుందని, అయినా అచ్చెన్నాయుడు అమరావతి టీడీపీ అధ్యక్షుడిగా మాట్లాడారే తప్ప, ఏపీ టీడీపీ అధ్యక్షుడిలా మాట్లాడటం లేదని విమర్శించారు. యనమల రామకృష్ణుడు మోసం, దివాళాకోరుతనం అంటూ మాట్లాడుతున్నారని.. ఆనాడు చంద్రబాబు, ఎన్టీఆర్ను మోసం చేసినప్పుడు స్పీకర్గా ఉన్న ఆయన ఏం చేశారో చెప్పాలని నిలదీశారు. నియంతల్లా పాలించినందుకే ప్రజలు 23 స్థానాలకు పరిమితం చేశారనే విషయాన్ని బాబు సహా నేతలంతా గుర్తుంచుకుంటే మంచిదన్నారు.
చంద్రబాబుది రియల్ ఎస్టేట్ పోరాటం
Published Mon, Aug 9 2021 2:28 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
వైఎస్సార్సీపీ అభ్యర్థులకే మా మద్దతు
బోల్తా కొట్టిన బాబు బుల్బుల్ పిట్ట
‘సిద్ధం’ పాటల సీడీని ఆవిష్కరించిన భారతమ్మ
Lok Sabha Election 2024: ఎన్డీఏకు 150 సీట్లూ కష్టమే
మంత్రి పీఎస్ పనిమనిషి ఇంట్లో కోట్లు
ధైర్యంగా చెబుతున్నా.. సర్వేపల్లిని అభివృద్ధి చేశా
దళితులపై దాడి.. టీడీపీ నేతలపై కేసు
మహిళపై దాడి కేసులో నిందితుడికి శిక్ష
‘దురాయి’ని అడ్డం పెట్టుకుని..
నోటాకు చోటు
తప్పక చదవండి
- ఏబీసీ పార్టీలది ముస్లిం లీగ్ ఎజెండా: జేపీ నడ్డా
- డీజీపీగా హరీష్కుమార్ గుప్తా
- ‘సిద్ధం’ పాటల సీడీని ఆవిష్కరించిన భారతమ్మ
- అలా చేస్తే ఆ కిక్కే వేరు! అతడితో లవ్లో ఉన్నా: నటి
- హీట్వేవ్ నుంచి ఉపశమనం.. త్వరలో వర్షాలు: వాతావరణ శాఖ
- డైరెక్టర్తో హీరోయిన్ పెళ్లి.. మామయ్యను మండపానికి రానివ్వలేదట!
- మాచర్లలో సీఎం జగన్ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)
- కాంగ్రెస్ కీలక నిర్ణయం: బరిలోకి మాజీ ముఖ్యమంత్రులు
- హార్దిక్ కాదు!.. రోహిత్ తర్వాత టీమిండియా కెప్టెన్ అతడే!
- చంద్రబాబు మోసాల చరిత్రను గుర్తు తెచ్చుకోండి: సీఎం జగన్
Advertisement