తండ్రి మందలింపు.. బాలిక ఆత్మహత్య  | Girl Commits Suicide In Anantapur District | Sakshi
Sakshi News home page

తండ్రి మందలింపు.. బాలిక ఆత్మహత్య 

Nov 26 2021 7:23 AM | Updated on Nov 26 2021 7:23 AM

Girl Commits Suicide In Anantapur District - Sakshi

 తండ్రి మందలించడంతో మనస్తాపం చెందిన ఓ బాలిక ఆత్మహత్య చేసుకుంది. పోలీసులు తెలిపిన మేరకు.. గుత్తిలోని జెడ్‌.వీరారెడ్డి కాలనీకి చెందిన సుబ్బయ్యకు భార్య, ముగ్గురు కుమార్తెలు, ఓ కుమారుడు ఉన్నారు.

గుత్తి: తండ్రి మందలించడంతో మనస్తాపం చెందిన ఓ బాలిక ఆత్మహత్య చేసుకుంది. పోలీసులు తెలిపిన మేరకు.. గుత్తిలోని జెడ్‌.వీరారెడ్డి కాలనీకి చెందిన సుబ్బయ్యకు భార్య, ముగ్గురు కుమార్తెలు, ఓ కుమారుడు ఉన్నారు. ఇటీవల సుబ్బయ్య రెండో కుమార్తె ఈరమ్మ (13) ఎవరికీ తెలియకుండా ఇంటిలోని దేవుడి హుండీలో ఉన్న డబ్బు తీసుకుంది. ఈ విషయం తెలుసుకున్న తండ్రి ఆమెను మందలించాడు. దీంతో మనస్తాపం చెందిన ఆమె గురువారం ఇంటిలో ఎవరూ లేని సమయంలో ఫ్యాన్‌కు చీరతో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. సమాచారం అందుకున్న సీఐ శ్యామరావు అక్కడకు చేరుకుని పరిశీలించి, కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement