పౌర సరఫరా సంస్థలో ఆమ్యామ్యాల రాజ్యం | Commissions in payment of CMR bills to millers | Sakshi
Sakshi News home page

పౌర సరఫరా సంస్థలో ఆమ్యామ్యాల రాజ్యం

Oct 23 2025 5:08 AM | Updated on Oct 23 2025 5:08 AM

Commissions in payment of CMR bills to millers

మిల్లర్లకు సీఎంఆర్‌ బిల్లుల చెల్లింపులో కమీషన్ల పర్వం

గుంటూరు జిల్లాలో ఒక్క మిల్లర్‌కే బిల్లులు, అడ్వాన్స్‌లు

సాక్షి, అమరావతి: రాష్ట్ర పౌరసరఫరాల సంస్థలో వ­సూళ్ల రాజ్యం నడుస్తోంది. రాజకీయ సిఫారసు­లు, అవినీతి కాసులే పరమావధిగా వ్యవస్థ పనితీరు దిగజారింది. అమా­­త్యుల ఆదేశాలతో అవినీతి, అక్రమాల ఆరోపణలు ఎదుర్కొన్న వారి­ని కూటమి ప్రభుత్వం అందలం ఎక్కించింది. ప్రధాన కార్యాలయంతో పాటు జిల్లాల్లోను ఇదేరీతిలో బదిలీలు చేపట్టడంతో వసూళ్లు మూడుపు­వ్వులు, ఆరుకాయ­లుగా సాగుతున్నాయి. ఇప్పు­డు కస్టమ్‌ మిల్లింగ్‌ రైస్‌ (సీఎంఆర్‌)కు బిల్లుల చెల్లింపులో అవినీతి బహిర్గతమైంది. పీడీ­ఎస్‌ బియ్యం సేకరణలో భాగ­ంగా ప్రభుత్వం ఏటా ఖరీఫ్, రబీ సీజన్లలో రైతుల నుంచి ధాన్యం కొనుగోలు చేస్తుంది. ఆ ధాన్యాన్ని మిల్లులకు తరలించి కస్టమ్‌ మిల్లింగ్‌ రైస్‌ (సీఎంఆర్‌) చేయిస్తుంది.

దీనికిగాను ఏటా మిల్ల­ర్లకు రూ.­1,200 కోట్ల వరకు చెల్లి­స్తుంది. ఆయా సీజన్లు ముగిసిన తర్వాత పౌరసరఫరాల సంస్థ ఎండీ బిల్లుల చెల్లింపునకు సర్క్యులర్‌ ఇచి్చన అనంతరమే ఈ బిల్లులు పెట్టాలి. నిధుల లభ్యతను బట్టి ఎండీ ఆదేశాలతోనే చెల్లించాలి. కానీ కొందరు ఉన్నతాధికారుల నుంచి కిందిస్థాయి సిబ్బంది వరకు ఇష్టారీతిన చెల్లించేస్తు­న్నా­రు. సీఎంఆర్‌ 2023–24కు సంబంధించి చెల్లింపులకు గతే­డాది ఆగస్టు–సెపె్టంబర్‌లో ఎండీ స­ర్క్యు­­లర్‌ జారీచేయడంతో రాష్ట్ర­వ్యాప్తంగా మిల్లర్లు బిల్లు­లను ఆప్‌లోడ్‌ చేశారు. నిధులు లేకపోవడంతో చెల్లి­ంపు­లు ఆలస్యమయ్యా­యి.

ఇటీవల మార్కె­ఫెడ్‌ ద్వారా పౌరసరఫరాల సం­స్థకు రూ.వెయ్యికోట్ల అప్పు అందింది. 2023–24 సీఎంఆర్‌ బిల్లుల చెల్లింపులకు ఎండీ ఆ­దేశించారు. ఏపీలో చాలామంది మిల్లర్లకు బిల్లులు చెల్లించారు. గుంటూరు జిల్లాలో మాత్రం పొన్నూరుకు చెందిన ఒక మిల్లరుకే డబ్బు జమచేశారు. దీనికి స్థానిక పౌరసరఫరాల సంస్థ అధికారి చక్రం తిప్పినట్టు తెలుస్తోంది. గతంలో ప్రధాన కా­ర్యా­లయానికి ఆ ఒక్క మిల్లరు బిల్లును విడిగా పెట్టి, మిగిలిన మిల్లర్ల బిల్లులను కలిపి పె­ట్టించారు. కలిపి పెట్టిన బిల్లులను పలు కారణాలతో రిజెక్టు చేయించి సింగిల్‌గా పెట్టిన బిల్లులకు డబ్బులిచ్చేశారు.  

అడ్వాన్స్‌ రూపంలో చెల్లింపులు  
గుంటూరు జిల్లాలో 28 మిల్లులున్నాయి. వీటిలో పొన్నూరుకు చెందిన మిల్లర్‌కు మా­త్రమే రెండు, మూడునెలల కిందటే అడ్వా­న్సుగా రూ.20 లక్షలకుపైనే ఇచ్చేశారు. ఎండీ ఆదేశాలతో పనిలేకుండా ప్రధాన కార్యా­లయంలోని ఫైనాన్స్‌ అధికారులతో కుమ్మకైన గుంటూరు అధికారి గుట్టుచప్పుడు కాకుండా ఈ అడ్వాన్స్‌ని ఇప్పించడం గమనార్హం. ఇంతటితో ఆగకుండా 2024–25 సీఎంఆర్‌ నిధుల చెల్లింపులకు ఎండీ సర్క్యులర్‌ రానప్పటికీ, పాత పద్ధతిలోనే పొన్నూరు మిల్లర్‌కు మరో రూ.80 లక్షల వరకు అ­డ్వాన్స్‌ ఇప్పించినట్టు సమాచారం. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement