24 గంటల్లో రాష్ట్రంలో 500 కేసులు | AP Corona Update 500 New Cases Reported | Sakshi
Sakshi News home page

24 గంటల్లో రాష్ట్రంలో 500 కేసులు

Dec 15 2020 6:39 PM | Updated on Dec 15 2020 7:19 PM

AP Corona Update 500 New Cases Reported - Sakshi

సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో గత 24 గంటల్లో 61,452 కరోనా పరీక్షలు నిర్వహించగా.. 500 మందికి పాజిటివ్‌గా నిర్థారణ అయ్యింది. ఇప్పటివరకు రాష్ట్రంలో కరోనా సోకిన వారి సంఖ్య 8,76,336కి చేరింది. ఈ మేరకు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ హెల్త్‌ బులెటిన్‌ విడుదల చేసింది. (కరోనా: వీటి పనితీరుతో ‘ఔరా’ అనాల్సిందే! )

గడచిన 24 గంటల్లో 563 మంది కోవిడ్‌ నుంచి కోలుకుని డిశ్చార్జ్‌ అవ్వగా, ఇప్పటివరకు 8,64,612  మంది డిశ్చార్జ్‌ అయ్యారు. గడచిన 24 గంటల్లో  వల్ల ఐదుగురు మరణించగా.. ఇప్పటివరకు కరోనా సోకి 7,064 మంది మృతిచెందారు. ప్రస్తుతం రాష్ట్రంలో 4,660 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్‌లో రికార్డు స్థాయిలో కరోనా పరీక్షలు జరుగుతున్నాయి. నేటివరకు  1,09,37,377 శాంపిల్స్‌ను పరీక్షించారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement