వైఎస్సార్‌సీపీ నేత దశరథరామిరెడ్డిపై హత్యాయత్నం | Annamayya District: Attack On Ysrcp Leader Dasaradha Rami Reddy | Sakshi
Sakshi News home page

వైఎస్సార్‌సీపీ నేత దశరథరామిరెడ్డిపై హత్యాయత్నం

May 3 2026 1:35 PM | Updated on May 3 2026 2:55 PM

Annamayya District: Attack On Ysrcp Leader Dasaradha Rami Reddy

సాక్షి, అన్నమయ్య జిల్లా: రాయచోటిలో మంత్రి రాంప్రసాద్‌రెడ్డి అనుచరులు రెచ్చిపోయారు. వైఎస్సార్‌సీపీ నేత, మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ పి. దశరథరామిరెడ్డిపై మంత్రి అనుచరులు వేట కొడవళ్లతో దాడి చేశారు. మంత్రి అనుచరుల దాడిలో దశరథరామిరెడ్డి సహా పలువురు కార్యకర్తలు తీవ్రంగా గాయపడ్డారు. దశరథరామిరెడ్డితో పాటు మరో ఇద్దరి కార్యకర్తల పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు.

దశరథరామిరెడ్డికి చెందిన కళ్యాణ మండపంలో అద్దాలు, వాహనాన్ని మంత్రి అనుచరులు ధ్వంసం చేశారు. హైకోర్టు స్టే ఇచ్చిన ఓ స్థల వివాదంలో సెటిల్‌మెంట్‌ చేస్తామంటూ మంత్రి అనుచరులు రంగంలోకి దిగారు. నిన్న(శనివారం) రాత్రి నుంచి స్థలంలో టీడీపీ మూకలు తిష్ట వేశారు. ఈ క్రమంలో ఇవాళ(ఆదివారం) వైఎస్సార్సీపీ వైస్ చైర్మన్ దాశరథామిరెడ్డిపై దాడికి పాల్పడ్డారు.

 

 

Advertisement
 
Advertisement
Advertisement