‘అహం బ్రహ్మాస్మి’పై భర్తల ఫిర్యాదు | Aham Brahmhasmi Frauds Come To Fore Once Again | Sakshi
Sakshi News home page

‘అహం బ్రహ్మాస్మి’పై భర్తల ఫిర్యాదు

Jan 28 2025 1:20 PM | Updated on Jan 28 2025 1:20 PM

Aham Brahmhasmi Frauds Come To Fore Once Again

తెరపైకి కిలాడీ మాతాశ్రీ బ్లాక్‌మెయిల్‌ వ్యవహారం 

విశాఖపట్నం, సాక్షి:  నగరంలో మరోసారి అహం బ్రహ్మాస్మి మోసాలు తెరపైకి వచ్చాయి. ఈసారి ఆశ్రమానికి వచ్చే యువతీయువకులనే లక్ష్యంగా చేసుకుని చెలరేగిపోతోంది మాతా శ్రీ సహస్ర తారా విశాల్ అలియాస్ స్వప్న. ఆశ్రమానికి వచ్చే యువతకు దైవనిర్ణయం పేరిట బలవంతపు వివాహాలు చేయిస్తోంది మాతా శ్రీ సహస్ర తారా విశాల్. 

ఆపై భర్తల నుంచి ఆ భార్యలను విడదీసి తన ఆశ్రమంలోనే ఉంచుతోంది. ఈ వ్యవహారంపై బాధిత భర్తలు ఆమెను నిలదీస్తే.. ఆశ్రమానికి డొనేషన్ల పేరిట వాళ్ల ఆస్తులు రాసివ్వాలంటూ డిమాండ్‌ చేస్తోంది. దీంతో.. చేసేది లేక కొందరు డబ్బులు, మరికొందరు ఆస్తులు రాసి ఇచ్చినట్లు తెలుస్తోంది. 

ఈమధ్య ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురికి ఇలాగే వేర్వేరు ప్రాంతాలకు చెందిన వాళ్లతో వివాహం జరిపించింది. అయితే.. భార్యలు ఆశ్రమం పట్టునే ఉండడంతో సదరు బాధిత భర్తలు పోలీస్‌ కమిషనర్‌కు ఫిర్యాదు చేశారు. దీంతో కిలాడీ మాతాశ్రీ కోసం పోలీసులు రంగంలోకి దిగారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement