ఏపీలో కొత్తగా 17,188 కరోనా కేసులు
సాక్షి, అమరావతి : గత 24 గంటల్లో ఆంధ్రప్రదేశ్లో 1,00,424 కరోనా పరీక్షలు నిర్వహించగా 17,188 మందికి కరోనా పాజిటివ్గా నిర్థారణ అయ్యింది. ఇప్పటివరకు రాష్ట్రంలో 1245374మందికి కరోనా వైరస్ సోకింది. నిన్న ఒక్కరోజే కరోనా బారిన పడి 73 మంది మృత్యువాతపడ్డారు. దీంతో మొత్తం మరణాల సంఖ్య 8519కే చేరింది. గడిచిన 24 గంటల్లో 12,749 మంది కోవిడ్ నుంచి కోలుకుని క్షేమంగా డిశ్చార్జ్ అవ్వగా, ఇప్పటివరకు 10,50,160 మంది డిశ్చార్జ్ అయ్యారు.
ఈ మేరకు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ శుక్రవారం కరోనాపై హెల్త్ బులెటిన్ విడుదల చేసింది. ఏపీలో ప్రస్తుతం 1,86,695 యాక్టివ్ కేసులు ఉన్నాయి. రాష్ట్రంలో నేటి వరకు 1,71,60,870 కరోనా నిర్థారణ పరీక్షలు నిర్వహించారు.
మరిన్ని వార్తలు