సాక్షి, అమరావతి: రాష్ట్రంలో 14 హరిత ఇంధనం (గ్రీన్ ఎనర్జీ) ప్రాజెక్టులకు ప్రభు త్వం అనుమతులు మంజూరు చేసింది. ఈ మేరకు ఇంధన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్ మంగళవారం వేర్వేరుగా ఉత్తర్వులు జారీ చేశారు.
అనుమతులు పొందిన ప్రాజెక్టులు
» శ్రీ సత్యసాయి జిల్లా అమడగూరు మండలంలో రిలయన్స్ ఇండస్ట్రీస్ 6600 మెగావాట్ల ఏసీ/ 9000 డీసీ సౌర విద్యుత్ ప్రాజెక్టు.
» అదానీ హైడ్రో ఎనర్జీ ఎలెవన్ లిమిటెడ్కు వైఎస్సార్ కడపజిల్లా గండికోటలో 2250 మెగావాట్ల పంప్డ్ స్టోరేజ్ ప్రాజెక్టు–2.
» తిరుపతి జిల్లాలో యమ్నాకో ఇండియా ప్రైవేట్ లిమిటెడ్కు 89 కేటీపీఏ గ్రీన్ హైడ్రోజన్ ప్రాజెక్టు
» అనంతపురం జిల్లా డి.హిరేహాల్ మండలంలోని కడలూరు, హుళికల్ గ్రామాల్లో క్లీన్ రెన్యువబుల్ ఎనర్జీ హైబ్రిడ్ సంస్థకు 140.80 ఏసీ/ 211.20 డీసీ ప్రాజెక్టులు.
» నంద్యాల జిల్లా అవుకు మండలం సింగనపల్లి గ్రామంలో క్లీన్ రెన్యువబుల్ ఎనర్జీ హైబ్రిడ్ త్రీ ప్రైవేట్ లిమిటెడ్ 35 ఏసీ/ 52.50 డీసీ ప్రాజెక్టు.
» పల్నాడు జిల్లా విప్పర్ల గ్రామంలో 12 టీపీడీ సామర్థ్యంతో డెల్టా బయోగ్యాస్ పల్నాడు టు ప్రైవేట్ లిమిటెడ్కు కంప్రెస్డ్ బయోగ్యాస్ ప్లాంట్.
» ఏలూరు జిల్లా ముప్పవరం గ్రామంలో 20 టీపీడీ సామర్థ్యంతో హెచ్పీసీఎల్ రెన్యువబుల్ అండ్ గ్రీన్ ఎనర్జీ లిమిటెడ్ కంప్రెస్డ్ బయోగ్యాస్ ప్లాంట్.
» తిరుపతి జిల్లా నాయడుపేట మండలం మెనకూరు గ్రామంలో ఎనర్జియా బయోఫ్యూయెల్స్ ఎల్ఎల్పీ సంస్థకు 12 టీపీడీ కంప్రెస్డ్ బయోగ్యాస్ ప్లాంట్.
» తూర్పు గోదావరి జిల్లా బిక్కవోలు మండలం బలభద్రపురం గ్రామంలో విభాబయోఫ్యూయెల్స్ ప్రైవేట్ లిమిటెడ్కు 15 టీపీడీ బయోగ్యాస్ ప్లాంట్.
» నెల్లూరు జిల్లా ఉదయగిరి మండలంలోని సున్నంవారిచింతల గ్రామంలో శ్రీ బాలాజీ బయో ఎనర్జీస్ అండ్ ఆర్గానిక్స్కు 12 టీపీడీ కంప్రెస్డ్ బయోగ్యాస్ ప్లాంట్.
» ఎన్టీఆర్ జిల్లా జి.కొండూరు మండలం కడింపొరవరంలో ఐవోసీజీపీఎస్ రెన్యువబుల్స్ ప్రైవేట్ లిమిటెడ్కు 15 టీపీడీ కంప్రెస్డ్ బయోగ్యాస్ ప్లాంట్.
» విజయనగరం జిల్లా వంగర మండలం తలగాం గ్రామంలో అమృత శ్రీ బయో–సీఎన్సీ ప్రైవేట్ లిమిటెడ్కు 12 టీడీపీ బయో–సీఎన్సీ ప్లాంట్ .
» క్రోమా–ఆటోర్ పవర్ ప్రొడక్ట్ ప్రైవేట్ లిమిటెడ్ చేపట్టనున్న 200 టీపీడీ కంప్రెస్డ్ బయోగ్యాస్ ప్రాజెక్టు ఎడవల్లి గ్రామం నుంచి రెంటచింతల మండలం జెట్టిపాలెం గ్రామానికి మార్పు.
» శ్రీ సత్యసాయి జిల్లా ఎన్పీకుంట మండలంలోని పి.కొత్తపల్లి గ్రామంలో 100 మెగావాట్ల సౌర విద్యుత్ ప్రాజెక్టు కోసం 325 ఎకరాల భూమి లీజ్ ఒప్పందం పునరుద్ధరణకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది.


