ఏపీలో భారీగా తగ్గిన కరోనా కేసులు.. | 139 New Corona Positive Cases Reported In AP | Sakshi
Sakshi News home page

ఏపీలో కొత్తగా 139 కరోనా కేసులు

Jan 21 2021 5:28 PM | Updated on Jan 21 2021 5:28 PM

139 New Corona Positive Cases Reported In AP - Sakshi

సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో కరోనా కేసులు భారీగా తగ్గుముఖం పడుతున్నాయి. రాష్ట్రంలో గత 24 గంటల్లో 49,483 కరోనా పరీక్షలు నిర్వహించగా, 139 మందికి పాజిటివ్‌గా నిర్థారణ అయ్యింది. ఇప్పటికి ఏపీలో కరోనా సోకిన వారి సంఖ్య 886557కి చేరింది. గత 24 గంటల్లో​ రాష్ట్రంలో కరోనా బారినపడి ఎటువంటి మరణం సంభవించలేదు. ఇప్పటి వరకు కరోనాతో 7142 మంది మృతి చెందారు. చదవండి: వ్యాక్సిన్‌తో 7 లక్షల మంది చనిపోతారన్న బిల్‌గేట్స్‌?! 

గత 24 గంటల్లో 254 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్‌ అవ్వగా, ఇప్పటివరకు మొత్తం 8,77,893 మంది డిశ్చార్జ్‌ అయ్యారు. ప్రస్తుతం ఏపీలో 1,522 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. రాష్ట్రంలో రికార్డుస్థాయిలో కరోనా పరీక్షలు జరుగుతున్నాయి. నేటి వరకు  కోటి 27 లక్షల 39 వేల 648 కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు. చదవండి: సెకండ్‌ రౌండ్‌లో టీకా తీసుకోనున్న మోదీ?!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement