తాడేపల్లి: వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి రేపు(బుధవారం, ఏప్రిల్ 1వ తేదీ) ప్రెస్మీట్ నిర్వహించనున్నారు. రేపు ఉదయం 11 గంటలకు ప్రెస్మీట్లో ఆయన మాట్లాడనున్నారు.ఏపీలోని ప్రజా సమస్యలు, తాజా రాజకీయ పరిణామాలు, సమకాలీన అంశాలపై ఆయన మాట్లాడతారు. తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో ఈ మీడియా సమావేశం నిర్వహించనున్నారు.


