ఏపీలో కొత్తగా 1,056 కరోనా కేసులు
సాక్షి, అమరావతి : ఆంధ్రప్రదేశ్లో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య భారీగా తగ్గుతోంది. గడిచిన 24 గంటల్లో 53,215 నమూనాలు పరీక్షించగా.. 1 ,056 కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 8,54,011కు చేరింది. నిన్న ఒక్కరోజే 2,140 మంది వైరస్ బారినుంచి కోలుకున్నారు. ఇప్పటివరకు మొత్తం 8,28,484 మంది కరోనా నుంచి కోలుకున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం యాక్టివ్ కేసుల సంఖ్య 18,659. వైరస్ బాధితుల్లో కొత్తగా 14 మంది మృతి చెందడంతో.. మొత్తం మృతుల సంఖ్య 6,868కు చేరింది. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ వైద్యారోగ్యశాఖ ఆదివారం కరోనాపై హెల్త్ బులెటిన్ విడుదల చేసింది.
చదవండి : ( అహ్మద్ పటేల్ ఆరోగ్య పరిస్థితి విషమం )
సంబంధిత వార్తలు