
రేషన్కు నగదు బదిలీ ఆలోచన మానుకోవాలి
రాయదుర్గంటౌన్: ప్రజా పంపిణీ వ్యవస్థలో భాగంగా లబ్ధిదారులకు రేషన్కు నగదు బదిలీ చేయాలనే ఆలోచనను మానుకోవాలని కూటమి ప్రభుత్వానికి సీపీఎం జిల్లా కార్యదర్శి నల్లప్ప, రైతు సంఘం జిల్లా కార్యదర్శి చంద్రశేఖరరెడ్డి హితవు పలికారు. స్థానిక ఏపీఎన్జీఓ భవనంలో శుక్రవారం రాయదుర్గం, కణేకల్లు, డి.హీరేహాళ్ మండలాల సీపీఎం నాయకులతో సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. అనంతరం నల్లప్ప మాట్లాడుతూ.. రేషన్ బియ్యం పథకాన్ని కచ్చితంగా కొనసాగించాలని డిమాండ్ చేశారు. నగదు బదిలీ చేస్తే నిజమైన లబ్దిదారులు, పేదలు నష్టపోతారన్నారు. కార్యక్రమంలో సీపీఎం నాయకులు మల్లికార్జున, నాగరాజు, లోకేష్, నాగరాజు, మధు, తిమ్మరాజు, శంకర్, పాల్గొన్నారు.
అగ్రిగోల్డ్ బాధితులకు
న్యాయం చేయాలి
అనంతపురం అర్బన్: ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు అగ్రిగోల్డ్ బాధితులకు సత్వర న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని అగ్రిగోల్డ్ కస్టమర్లు, ఏజెంట్ల సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తిరుపతిరావు డిమాండ్ చేశారు. శుక్రవారం స్థానిక ఆ సంఘం కార్యాలయంలో సంఘం ఉమ్మడి జిల్లా గౌరవాధ్యక్షుడు పి.నారాయణస్వామితో కలసి విలేకరులతో ఆయన మాట్లాడారు. అగ్రిగోల్ బాధితులను ఆదుకునే అంశాన్ని టీడీపీ తన ఎన్నికల మేనిఫేస్టోలో ఉంచిందని గుర్తు చేశారు. హామీని అమలు చేయకపోతే బాధితులతో కలిసి మరోసారి ఉద్యమానికి శ్రీకారం చుడతామని హెచ్చరించారు. కార్యక్రమంలో సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి సిద్ధేశ్వర్, జిల్లా అధ్యక్షుడు నారాయణప్ప, సభ్యులు కుళ్లాయప్ప, ధనుంజయ, దస్తగిరి, తదితరులు పాల్గొన్నారు.
మట్కా రాస్తున్న మహిళల అరెస్ట్
తాడిపత్రి టౌన్: పట్టణంలోని వివిధ ప్రాంతాల్లో మట్కా రాస్తున్న ముగ్గురు మహిళలను అరెస్ట్ చేసినట్లు సీఐ సాయిప్రసాద్ తెలిపారు. అందిన సమాచారం మేరకు శుక్రవారం తనిఖీలు చేపట్టి పక్కా ఆధారాలతో సరస్వతి, కుళ్లాయమ్మ, జ్యోతిని అరెస్ట్ చేసి, వారి నుంచి రూ.1.30 లక్షల నగదు, సెల్ఫోన్లు, మట్కా పట్టీలు స్వాధీనం చేసుకున్నామన్నారు.
అనుమానాస్పద మృతి
అనంతపురం: నగరంలోని ఓ ప్రైవేట్ హాస్టల్లో ఉంటున్న అభిషేక్కుమార్ (20) గురువారం రాత్రి బాత్రూంలో వాంతి చేసుకుని మృతి చెందాడు. సమాచారంతో సంఘటనా స్థలానికి చేరుకుని వన్టౌన్ ఎస్ఐ లక్ష్మీనారాయణ విచారణ చేపట్టారు. బీహార్లోని వెస్ట్ చంపారన్ జిల్లా బహుర్వా గ్రామానికి చెందిన సీతాదేవి, శంభురామ్ దంపతుల చిన్న కుమారుడు అభిషేక్ కుమార్ ఇంటర్ పూర్తి చేసి రెండు నెలల క్రితం ముంబయిలోని యూనీ సర్వేడ్ టెక్ సొల్యుషన్స్ కంపెనీలో నెట్వర్క్ టెక్నీషియన్గా పనిలో చేరాడు. శిక్షణ అనంతరం కంపెనీ ఆదేశాల మేరకు ఈ నెల 4వ తేదీ నుంచి అనంతపురం కేంద్రంగా విధులు చేపట్టాడు. శ్రీకంఠం సర్కిల్లోని పీజీ హాస్టల్లో ఉంటూ విధుల్లో భాగంగా యాడికి సమీపంలోని పెన్నా సిమెంట్ ఫ్యాక్టరీ వద్ద ఎయిర్టెల్ నెట్వర్క్ చెకింగ్కు వెళ్లి వచ్చేవాడు. ఈ క్రమంలో శుక్రవారం విధులు ముగించుకుని వస్తూ మార్గమధ్యంలో తన స్నేహితుడు జయప్రకాష్కుమార్ రాయ్తో కలసి గోబీ మంచూరియా తిని సాయంత్రం హాస్టల్కు చేరుకున్నాడు. రాత్రి 7గంటలకు జయ ప్రకాష్ పిలిచినా భోజనానికి వెళ్లలేదు. కాసేపటి తర్వాత భోజనం గదిలోకి తెచ్చి పెట్టి తినమని జయప్రకాష్ తెలపడంతో ఆరోగ్యం ఇబ్బందిపెడుతుంటే మందులు వేసుకున్నానని అలాగే నిద్రపోయాడు. రాత్రి 8:15 గంటలకు బాత్రూంకు వెళ్లిన అభిషేక్ అక్కడ వాంతులు చేసుకుంటూ కుప్పకూలాడు. గమనించిన జయప్రకాష్కుమార్ వెంటనే తన రూం మేట్స్ నాగూర్ వలి, పోతులయ్య, పీజీ హాస్టల్ యజమాని నాగేశ్వరరెడ్డితో కలసి ఆటోలో సర్వజనాస్పత్రికి తీసుకెళ్లారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే అభిషేక్కుమార్ మృతిచెందినట్లు నిర్ధారించారు. మృతిపై అనుమానాలు వ్యక్తం చేస్తూ అభిషేక్ బావ రూపేష్రామ్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు అనంతపురం వన్టౌన్ పీఎస్ పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు.

రేషన్కు నగదు బదిలీ ఆలోచన మానుకోవాలి

రేషన్కు నగదు బదిలీ ఆలోచన మానుకోవాలి