
ప్రతి విద్యార్థికీ విద్యా సామగ్రి అందాలి
ఆత్మకూరు: ప్రభుత్వం అందిస్తున్న సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యా సామగ్రి ప్రతి ఒక్క విద్యార్థికి తప్పనిసరిగా అందజేయాలని రాష్ట్ర ప్రభుత్వ పరిశీలకుడు వెంకట శివసాయి సూచించారు. ఆత్మకూరులోని ఉన్నత పాఠశాలను శుక్రవారం ఆయన పరిశీలించారు. విద్యార్థులతో నేరుగా మాట్లాడి సమస్యలపై ఆరా తీశారు. మధ్యాహ్న భోజనంలో నాణ్యత లోపించరాదన్నారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
సబ్సిడీ బియ్యం పట్టివేత
రాప్తాడు: అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నట్లు అనంతపురం రూరల్ డీఎస్పీ వెంకటేసులు తెలిపారు. సోమందేపల్లికి చెందిన నరేష్ 42 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని కర్ణాటకలోని పావగడకు బొలెరో వాహనంలో తరలిస్తూ శుక్రవారం రాప్తాడులోని వైఎస్సార్ సర్కిల్లో పట్టుపడ్డాడన్నారు. వాహనాన్ని సీజ్ చేసి, స్వాధీనం చేసుకున్న బియ్యాన్ని స్టాక్ పాయింట్కు తరలించినట్లు వివరించారు.
పశు శాఖ జేడీగా సుధాకర్
అనంతపురం సెంట్రల్: పశు సంవర్థకశాఖ జాయింట్ డైరెక్టర్గా డాక్టర్ టీవీ సుధాకర్ను నియమిస్తూ ఆ శాఖ డైరెక్టర్ దామోదర్నాయుడు శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. ప్రస్తుత జేడీ వెంకటస్వామి ఈ నెల 30న ఉద్యోగ విరమణ చేయనున్నారు.

ప్రతి విద్యార్థికీ విద్యా సామగ్రి అందాలి