
గుత్తి కోట ఉత్సవాలకు రూ.50 లక్షలు
గుత్తి: వచ్చే ఏడాది జనవరిలో గుత్తి కోట ఉత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు కలెక్టర్ వినోద్కుమార్ తెలిపారు. ఇందుకు గాను రూ.50 లక్షలు నిధులు మంజూరు చేస్తున్నట్లు తెలిపారు. యోగాంధ్ర కార్యక్రమాన్ని సోమవారం గుత్తి కోటపై నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కలెక్టర్ వినోద్కుమార్, జాయింట్ కలెక్టర్ శివ్నారాయణ్ శర్మ, డీఆర్ఓ మలోల హాజరయ్యారు. స్థానిక మున్సిపల్ కమిషనర్ జబ్బార్ మియా, గుత్తి కోట సంరక్షణ సమితి అధ్యక్షుడు విజయ భాస్కర్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో డీఎంహెచ్ఓ ఈబీ దేవి, జిల్లా పర్యాటక అధికారి విజయకుమార్, ఆర్డీఓ శ్రీనివాస్, పలువురు జిల్లా స్థాయి అధికారులు, కమిషనర్ జబ్బార్ మియా, తహశీల్దార్ ఓబులేసు, ఎంపీడీఓ ప్రభాకర్ నాయక్, మున్సిపల్ చైర్పర్సన్ వన్నూర్బీ, మహర్షి దయానంద గురుకుల పాఠశాల ఎన్సీసీ విద్యార్థులు, అంగన్వాడీ కార్యకర్తలు, ఉపాధ్యాయులు, ఆరోగ్య సిబ్బంది, ఆశా వర్కర్లు పాల్గొన్నారు.