ఆర్డీటీకి నిధులు తెప్పిస్తా | - | Sakshi
Sakshi News home page

ఆర్డీటీకి నిధులు తెప్పిస్తా

May 9 2025 1:44 AM | Updated on May 9 2025 1:44 AM

ఆర్డీటీకి నిధులు తెప్పిస్తా

ఆర్డీటీకి నిధులు తెప్పిస్తా

అనంతపురం టవర్‌క్లాక్‌: ఆర్డీటిపై కక్ష సాధింపు చర్యలు తగదని ప్రభుత్వాలకు ప్రజాశాంతి పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు కేఏ పాల్‌ సూచించారు. ఎఫ్‌సీఆర్‌ఏ పునరుద్ధరణ అంశంపై కేంద్ర ప్రభుత్వం చర్చించి ఆర్డీటీకి నిధులు అందేలా చొరవ తీసుకుంటానని పేర్కొన్నారు. గురువారం అనంతపురం పర్యటనకు వచ్చిన ఆయన స్థానిక ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. రాయలసీమలో ప్రతి ఇంటికీ సేవలు అందించిన ఘనమైన ఆర్డీటీకి ఉందన్నారు. ఆర్డీటీకు అన్ని విధాలుగా అండగా ఉంటానన్నారు. నిధుల సమీకరణకు ప్రపంచ దేశాల ప్రతినిధులతో మాట్లాడతానన్నారు. ప్రస్తుతం భారత్‌, పాక్‌ మధ్య నెలకొన్న యుద్ధ వాతావరణాన్ని ఆపేందుకు తన వంతు కృషి చేస్తానన్నారు. ఇందు కోసం పాకిస్తాన్‌కు వెళ్లి ఆ దేశ అధ్యక్షుడితో చర్చలు జరిపేందుకు సిద్ధంగా ఉన్నానన్నారు. దేశం అభివృద్ధి చెందాలంటే ప్రజాశాంతి పార్టీ అధికారంలోకి రావాలన్నారు. ప్రజాశాంతి పార్టీలో చేరి బలోపేతం చేయాలని కోరారు.

ప్రజాశాంతి పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు కేఏ పాల్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement