
పరాకాష్టకు ‘రెడ్బుక్’ వేధింపులు
● అక్రమ అరెస్టులు అప్రజాస్వామికం
● వైఎస్సార్సీపీ టాస్క్ఫోర్స్ సభ్యుడు రమేష్గౌడ్
అనంతపురం కార్పొరేషన్: రాష్ట్రంలో రెడ్బుక్ రాజ్యాంగం వేధింపులు పరాకాష్టకు చేరుకున్నాయని వైఎస్సార్సీపీ టాస్క్ఫోర్స్ సభ్యుడు, రాష్ట్ర కార్యదర్శి రమేష్ గౌడ్ ధ్వజమెత్తారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి అరెస్ట్ను ఖండించారు. వైఎస్సార్సీపీ శ్రేణులను లక్ష్యంగా చేసుకుని కక్షక్ష పూరిత చర్యలకు పాల్పడడడం దారుణమన్నారు. పల్నాడు జంట హత్య కేసులో టీడీపీకి సంబంధించిన ఇరువర్గాలు గొడవపడి ఓ వర్గం వారిని హత్య చేశారని, మృతుల బంధువుల చెబుతున్నా.. ఎలాంటి సంబంధం లేని పిన్నెల్లి బ్రదర్స్ను కేసులో ఇరికించడం అన్యాయమన్నారు. సినీ నటుడు పోసాని కృష్ణమురళీ, వల్లభనేని వంశీను ముప్పుతిప్పలు పెడుతున్నారన్నారు. ప్రజలకు మేలు చేయాల్సిన నాయకులు రెడ్బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తూ రాష్ట్రాభివృద్ధిని తిరుగోమనం దిశగా మళ్లించారని మండిపడ్డారు. ఇలాంటి దుర్భర పరిస్థితుల్లో పరిశ్రమల ఏర్పాటుకు ఎవరు ముందుకు వస్తారన్నారు. అమరావతి జపం, రెడ్బుక్ రాజ్యాంగం అమలు తప్ప కూటమి ప్రభుత్వం ప్రజలకు చేసిన మంచి ఏదీ లేదన్నారు. ఏడాది గడుస్తున్నా సూపర్ సిక్స్ హామీలను ఏమాత్రం పట్టించుకోవడం లేదన్నారు. అక్రమ అరెస్టులు అప్రజాస్వామికమని, రానున్న రోజుల్లో కూటమి ప్రభుత్వానికి బుద్ధి చెబుతామని హెచ్చరించారు.
హెచ్ఎం పదోన్నతులకు
నేడు సర్టిఫికెట్ల పరిశీలన
అనంతపురం ఎడ్యుకేషన్: ఉమ్మడి జిల్లాలోని పాఠశాల సహాయకుల నుంచి గ్రేడ్–2 ప్రధానోపాధ్యాయుల పదోన్నతులకు సంబంధించి ప్రొవిజినల్ సీనియార్టీ జాబితాలో ఉన్న టీచర్ల సర్టిఫికెట్ల పరిశీలన మంగళవారం నిర్వహించనున్నారు. ఈ మేరకు జిల్లా విద్యాశాఖ అధికారి ఎం.ప్రసాద్బాబు సోమవారం రాత్రి ఓ ప్రకటన విడుదల చేశారు. https://deoanantha puramu.blogspot.com వెబ్సైట్లో ప్రొవిజినల్ సీనియార్టీ ఉంచినట్లు తెలిపారు. ఈ జాబితాలోని పీఎస్హెచ్ఎంలు/స్కూల్ అసిస్టెంట్లు తమ విద్యార్హత ఒరిజనల్ సర్టిఫికెట్లు, ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన ఉపాధ్యాయులు కుల ధ్రువీకరణ పత్రాలు, పీహెచ్ టీచర్లు తమ ఒరిజనల్ విద్యార్హత పత్రాలతో పాటు మెడికల్ బోర్డు జారీ చేసిన సర్టిఫికెట్లతో ఉదయం 10 గంటలకు అనంతపురంలోని మొదటి రోడ్డులో ఉన్న శారదా బాలికల నగరపాలక ఉన్నత పాఠశాలలో చేపట్టిన పరిశీలన ప్రక్రియకు హాజరు కావాలని సూచించారు.