అనంతపురం కల్చరల్: గణపతి సచ్చిదానంద భగవద్గీత పారాయణ ట్రస్ట్ ఆధ్వర్యంలో జాతీయ స్థాయిలో నిర్వహించిన భగవద్గీత కంఠస్త పోటీల్లో అనంతపురానికి చెందిన నికితేష్రెడ్డి, సంధ్య దంపతుల కుమార్తె, 9 ఏళ్ల వయసున్న చిన్నారి నిహాన్సారెడ్డి బంగారు పతకాన్ని దక్కించుకుంది. ఈ నెల 18న మైసూరులో జరిగే కార్యక్రమంలో పీఠాధిపతి గణపతి సచ్చిదానంద స్వామీజీ చేతుల మీదుగా ఆమె బంగారు పతకంతో పాటు ప్రశంసాపత్రాన్ని అందుకోనుంది.
ఆయిల్ ట్యాంకర్ బోల్తా
గుంతకల్లు రూరల్: మండలంలోని తిమ్మాపురం సమీపంలో ఉన్న పద్మావతి ఆయుర్వేదిక్ కళాశాల వద్ద బళ్లారి వైపు వెళుతున్న ఓ ఆయిల్ ట్యాంకర్ బోల్తాపడింది. మంగళవారం తెల్లవారుజామున ఈ ఘటన చోటు చేసుకుంది. డ్రైవర్ నియంత్రణ కోల్పోవడంతో అదుపు తప్పి రోడ్డు పక్కన విద్యుత్ స్తంభాన్ని ఢీకొని బోల్తాపడింది. ఘటనలో 33 కేవీ విద్యుత్ లైన్కు ఏర్పాటు చేసిన విద్యుత్ స్తంభంతో పాటు దానికి సపోర్ట్గా నిలిపిన మరో స్తంభమూ కూలింది. విద్యుత్ వైర్లు కిందకు వేలాడాయి. స్థానికులు అప్రమత్తమై సమాచారం ఇవ్వడంతో విద్యుత్ సరఫరాను అధికారులు నిలిపివేశారు. ప్రమాదంలో గాయపడిన ట్యాంకర్ డ్రైవర్ అంజాద్బాషాను ప్రభుత్వాస్పత్రికి తరలించారు.
అత్యాచార యత్నం కేసులో నిందితుడి అరెస్ట్
పెద్దపప్పూరు: మతిస్థిమితం లేని మహిళపై అత్యాచార యత్నం చేసిన ఘటనలో నిందితుడు వీరాంజనేయులుని మంగళవారం అరెస్ట్ చేసినట్లు ఎస్ఐ నాగేంద్ర ప్రసాద్ తెలిపారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు సోమవారం కేసు నమోదు చేసిన పోలీసులు సమగ్ర విచారణ అనంతరం నిందితుడిని అరెస్ట్ చేసి, న్యాయమూర్తి ఆదేశాల మేరకు రిమాండ్కు తరలించారు.
ఐటీఐలో స్వల్పకాలిక కోర్సులు
అనంతపురం ఎడ్యుకేషన్: స్థానిక ప్రభుత్వ బాలుర ఐటీఐలో స్వల్ప కాలిక కోర్సులు అందుబాటులోకి తెచ్చినట్లు ప్రిన్సిపాల్ రామమార్తి తెలిపారు. ఈ మేరకు మంగళవారం ఓ ప్రకటన విడుదల చేశారు. ఆంధ్రప్రదేశ్ నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో ‘టూ వీలర్ సర్వీస్ అసిస్టెంట్, అసిస్టెంట్ ఎలక్ట్రీషియన్’ కోర్సులకు రెండు నెలల పాటు శిక్షణ ఇచ్చి, ఉత్తీర్ణులైన వారికి సర్టిఫికెట్లు అందజేస్తారు. అనంతరం ఉద్యోగ అవకాశం కల్పిస్తారు. ఆసక్తి ఉన్న పది, ఇంటర్, ఐటీఐ, డిగ్రీ అర్హతలున్న విద్యార్థులు ఈ నెల 12వ తేదీలోపు బయోడేటాను ఐటీఐ కార్యాలయంలో అందజేయాలి. పూర్తి వివరాలకు 88868 85173 లో సంప్రదించవచ్చు.

‘భగవద్గీత’ పోటీల్లో చిన్నారి ప్రతిభ