‘నీట్‌’కు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలి | - | Sakshi
Sakshi News home page

‘నీట్‌’కు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలి

May 2 2025 1:53 AM | Updated on May 2 2025 1:53 AM

‘నీట్‌’కు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలి

‘నీట్‌’కు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలి

అనంతపురం అర్బన్‌: ‘మెడికల్‌ గ్రాడ్యుయేషన్‌ కోర్సుల్లో ప్రవేశాల కోసం నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ నిర్వహిస్తున్న ‘నీట్‌’ పరీక్ష ఈనెల 4వ తేదీన జరగనుంది. 2,334 మంది అభ్యర్థులు హాజరుకానున్నారు. పరీక్ష నిర్వహణకు సంబంధించి ఏర్పాట్లు పకడ్బందీగా ఉండాలి.’’ అని కలెక్టర్‌ వి.వినోద్‌కుమార్‌ సంబంధిత అధికారులను ఆదేశించారు. గురువారం ఆయన కలెక్టరేట్‌లోని మినీ కాన్ఫరెన్స్‌ హాలులో జాయింట్‌ కలెక్టర్‌ శివ్‌ నారాయణ్‌ శర్మ, డీఆర్‌ఓ ఎ.మలోలతో కలిసి ‘నీట్‌’ నిర్వహణపై అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ... నీట్‌ పరీక్ష ఐదు కేంద్రాల్లో జరుగుతుందన్నారు. 4వ తేదీ మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పరీక్ష ఉంటుందన్నారు. కేంద్రాల వద్ద కట్టుదిట్టమైన భద్రత ఉండాలని ఆదేశించారు. సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని చెప్పారు. అదే విధంగా మౌలిక సదుపాయాలు కల్పించాలన్నారు. దివ్యాంగ అభ్యర్థుల కోసం ప్రత్యేకంగా వీల్‌ చైర్లు, సహాయకులను ఏర్పాటు చేయాలన్నారు. సమావేశంలో అసిస్టెంట్‌ కలెక్టర్‌ సచిన్‌ రావర్‌, పరిపాలనాధికారి అలెగ్జాండర్‌, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

బాలికల సాధికారత లక్ష్యంగా పనిచేయాలి..

కిశోర బాలికల సాధికారత లక్ష్యంగా పనిచేయాలని కలెక్టర్‌ వినోద్‌కుమార్‌ సంబంధిత అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టరేట్‌లోని మినీ కాన్ఫరెన్స్‌ హాలులో కిశోర బాలికల సమ్మర్‌ క్యాంపెయిన్‌ పోస్టర్లను కలెక్టర్‌ విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రత్యేక సమ్మర్‌ క్యాంపెయిన్‌ గ్రామ, వార్డు స్థాయిలో నిర్వహించాలన్నారు. జేసీ శివ్‌ నారాయణ్‌శర్మ, అసిస్టెంట్‌ కలెక్టర్‌ సచిన్‌ రావర్‌, డీఆర్‌ఓ ఎ.మలోల తదితరులు పాల్గొన్నారు.

అధికారులకు

కలెక్టర్‌ వినోద్‌కుమార్‌ ఆదేశం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement