సనపకు పోటెత్తిన జనం | - | Sakshi
Sakshi News home page

సనపకు పోటెత్తిన జనం

Apr 30 2025 1:52 AM | Updated on Apr 30 2025 1:52 AM

సనపకు

సనపకు పోటెత్తిన జనం

ఆత్మకూరు: మండలంలోని సనప గ్రామంలో ఊరి దేవరకు మంగళవారం భక్తులు పొటెత్తారు. 35 సంవత్సరాల తరువాత నిర్వహించిన ఊరి దేవరకు వేల సంఖ్యలో ప్రజలు రావడంతో సనప గ్రామం కిటకిటలాడింది. సోమవారం అర్ధరాత్రి సమయంలో పెద్దమ్మ తల్లి విగ్రహానికి ప్రత్యేక పూజలు నిర్వహించి జంతువులను బలిఇచ్చారు. అనంతరం మంగళవారం భక్తులు అమ్మవారికి టెంకాయలు కొట్టి మొక్కులు తీర్చుకున్నారు. ప్రతి ఇంట్లో మొక్కుబడిలో భాగంగా పొటేళ్లు, గొర్రెలను బలి ఇచ్చారు. గ్రామంలోకి వచ్చేందుకు ప్రజలకు గంటల సమయం పట్టింది. మూడు కిలో మీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి.

సనపకు పోటెత్తిన జనం 1
1/1

సనపకు పోటెత్తిన జనం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement