అధికారులపై కక్ష సాధింపు తగదు | - | Sakshi
Sakshi News home page

అధికారులపై కక్ష సాధింపు తగదు

Apr 24 2025 8:23 AM | Updated on Apr 24 2025 8:23 AM

అధికారులపై  కక్ష సాధింపు తగదు

అధికారులపై కక్ష సాధింపు తగదు

ఎమ్మెల్సీ శివరామిరెడ్డి

ఉరవకొండ: కూటమి ప్రభుత్వ పాలనా వైఫల్యాలు, అవినీతి అక్రమాలపై ప్రజల దృష్టి మళ్లించేందుకు సీఎం చంద్రబాబు తనకు అలవాటైన డైవర్షన్‌ పాలిటిక్స్‌ను అమలు చేస్తున్నారని శాసనమండలి ప్రివిలేజ్‌ కమిటీ చైర్మన్‌, ఎమ్మెల్సీ వై.శివరామిరెడ్డి మండిపడ్డారు. పీఎస్‌ఆర్‌ ఆంజనేయులు అరెస్ట్‌పై బుధవారం ఆయన స్పందించి, ఓ ప్రకటన విడుదల చేశారు. గత ప్రభుత్వంలో ఇంటలిజెన్స్‌ చీఫ్‌గా పీఎస్‌ఆర్‌ ఆంజనేయులు ఎంతో నిజాయితీతో పనిచేశారన్నారు. అలాంటి వ్యక్తిపై కూటమి ప్రభుత్వం రాజకీయ కక్ష సాధింపు చర్యలకు దిగడం సిగ్గు చేటన్నారు. ఇది మంచి సంప్రదాయం కాదని చంద్రబాబు గుర్తించాలన్నారు. రాజధాని కాంట్రాక్టు సంస్థల నుంచి భారీగా ముడపుల స్వీకరించి, హమీలను అమలు చేయకపోవడం, రూ. కోట్ల విలువైన భూములను కారుచౌకగా సూట్‌కేస్‌ కంపెనీలకు ధారాదత్తం చేయడం వంటి చర్యలపై ప్రజల్లో వ్యక్తమవుతున్న అసహనాన్ని డైవర్ట్‌ చేసేందుకు ఇంతటి దిగజారుడు రాజకీయాలకు చంద్రబాబు తెరతీశారని మండిపడ్డారు.

నేటి నుంచి ఇంటర్‌

అధ్యాపకులకు శిక్షణ

అనంతపురం ఎడ్యుకేషన్‌: ఇంటర్మీడియట్‌ విద్యా మండలి ఈ విద్యా సంవత్సరం (2025–26) నుంచి ప్రథమ సంవ్వత్సరం కోర్సుల్లో కొత్త సిలబస్‌ను ప్రవేశ పెట్టడం, ప్రశ్నాపత్రాల విధానంలో చేసిన మార్పులపై అధ్యాపకులకు గురువారం నుంచి జిల్లాస్థాయి శిక్షణ ఇవ్వనున్నారు. స్థానిక కేఎస్‌ఆర్‌ ప్రభుత్వ బాలికల కళాశాలలో జరిగే శిక్షణకు జిల్లాలోని రెగ్యులర్‌, కాంట్రాక్ట్‌, గెస్ట్‌ అధ్యాపకులు హాజరుకావాలని జిల్లా వృత్తి విద్యాధికారి ఎం.వెంకటరమణనాయక్‌ ఆదేశించారు. మొదటి దశ 24, 25 తేదీల్లో తెలుగు, ఇంగ్లిష్‌, హిందీ, ఉర్దూ, రెండో దశ 28, 29 తేదీల్లో మ్యాథ్స్‌, ఫిజిక్స్‌, కెమిస్ట్రీ, బోటనీ, మూడో దశ మే 2, 3 తేదీల్లో జువాలజీ, హిస్టరీ, ఎకనామిక్స్‌, సివిక్స్‌, చివరి నాలుగో దశ 5, 6 తేదీల్లో కామర్స్‌, సంస్కృతం అధ్యాపకులకు అవగాహన కల్పించనున్నట్లు పేర్కొన్నారు. ఇందులో ఏ ఒక్కరికీ మినహాయింపు ఉండదని అందరూ విధిగా హాజరుకావాలని డీవీఈఓ స్పష్టం చేశారు.

ఇంటర్‌లో ప్రవేశాలకు దరఖాస్తు చేసుకోండి

అనంతపురం రూరల్‌: జిల్లాలోని గొల్లలదొడ్డిలో ఉన్న గిరిజన గురుకుల కళాశాలలో 2025–26 ఇంటర్‌ మెదటి సంవత్సరం ప్రవేశాలకు అర్హులైన విద్యార్థుల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. ఈ మేరకు జిల్లా గిరిజన సంక్షేమ శాఖ అధికారి రామాంజనేయులు బుధవారం ఓ ప్రకటన విడుదల చేశారు. మే 7వ తేదీ లోపు https:/twreiscet. apcfss.in వెబ్‌సైట్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. పూర్తి వివరాలకు 98853 69079, 89782 39363, 83416 03090లో సంప్రదించవచ్చు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement