హోరీహోరీగా రాతిదూలం లాగుడు పోటీలు | - | Sakshi
Sakshi News home page

హోరీహోరీగా రాతిదూలం లాగుడు పోటీలు

Apr 18 2025 12:50 AM | Updated on Apr 18 2025 12:50 AM

హోరీహోరీగా రాతిదూలం లాగుడు పోటీలు

హోరీహోరీగా రాతిదూలం లాగుడు పోటీలు

గుంతకల్లు రూరల్‌: కాశిరెడ్డి నాయన నూతన ఆలయ ప్రారంభోత్సవం సందర్భంగా గుంతకల్లు మండలం పాతకొత్తచెరువు గ్రామంలో గురువారం గ్రామస్తుల ఆధ్వర్యంలో నిర్వహించిన రాతిదూలం లాగుడు పోటీలు హోరాహోరీగా సాగాయి. ఉమ్మడి కర్నూలు, అనంతపురం జిల్లాల నుంచి 14 జతల దేశం ఎద్దులను పోటీలకు రైతులకు తీసుకువచ్చారు. కర్నూలు జిల్లా జొన్నగిరికి చెందిన రైతు హుసేనప్ప ఎద్దులు మొదటి స్థానంలో, డి.హీరేహాల్‌ మండలం ఉద్యాల గ్రామ రైతు నరసింహులు ఎద్దులు ద్వితీయ స్థానంలో నిలిచాయి. తొలి నాలుగు స్థానాల్లో నిలిచిన ఎద్దుల యజమాలను గ్రామ సర్పంచ్‌ మల్లికార్జున, మాజీ సర్పంచ్‌ రాజన్న, వైఎస్సార్‌సీపీ బీసీ సెల్‌ నియోజకవర్గ అధ్యక్షుడు రంగనాయకులు, పరశురాముడు, వెంకటరాముడు, పందికోన శివ.. నగదు పురస్కారాలతో సత్కరించారు.

విద్యుదాఘాతంతో రైతు మృతి

రాయదుర్గం: మండలంలోని కాశీపురం గ్రామానికి చెందిన రైతు కావలి ఎర్రిస్వామి (54)విద్యుత్‌ షాక్‌తో మృతి చెందాడు. పోలీసులు తెలిపిన మేరకు.. గురువారం ఉదయం పొలానికి నీరు పెట్టేందుకు వెళ్లిన ఎర్రిస్వామి.. ట్రాన్స్‌ఫార్మర్‌ వద్ద ఫ్యూజులు ఎగిరిపోయినట్లుగా గుర్తించి, వాటిని వేస్తున్న క్రమంలో షాక్‌కు గురై అక్కడికక్కడే మృతిచెందాడు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement