యల్లనూరు: అకాల వర్షాలకు నష్టపోయిన ప్రతి రైతునూ ఆదుకుంటామని మంత్రి సవిత అన్నారు. సోమవారం నీర్జాంపల్లి, గొడ్డుమర్రి గ్రామాల్లో ఈదురుగాలులకు పడిపోయిన అరటి చెట్లను మంత్రి పరిశీలించారు. రైతులతో మాట్లాడారు. నష్ట అంచనాలను తయారు చేసి ప్రభుత్వానికి నివేదికలు పంపుతామని, పరిహారం అందేలా ముఖ్యమంత్రి చంద్రబాబు దృష్టికి సమస్యను తీసుకెళ్తామన్నారు. అంతకుముందు అనంతపురం సర్వజనాస్పత్రిలో చికిత్స పొందుతున్న రైతులు లక్ష్మీనారాయణ, చిన్న వెంగప్పను మంత్రి పరామ ర్శించారు. కార్యక్రమంలో జేసీ శివ్ నారాయణ్ శర్మ, ఆర్డీఓ కేశవనాయుడు, జిల్లా ఉద్యాన అధికారి నరసింహరావు తదితరులు పాల్గొన్నారు.