అనంతపురం అర్బన్: శాఖా పరంగా ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని డెఫ్ కమ్యూనిటీ ఉమెన్ ఉద్యోగులకు ఏపీ జేఏసీ అమరావతి చైర్మన్ దివాకర్రావు భరోసానిచ్చారు. ఆదివారం అనంతపురంలోని కృష్ణకళామందిర్లో ఉమెన్ డెఫ్ ఎంపవర్మెంట్ ఆధ్వర్యంలో 9వ అంతర్జాతీయ మహిళ దినోత్సవాన్ని నిర్వహించారు. డెఫ్ కమ్యూనిటీ ఉమెన్ టీమ్ కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలుపుకున్నారు. ఈ కార్యక్రమానికి దివాకర్రావుతో పాటు విశ్రాంత తహసీల్దారు పగడాల మల్లికార్జున ముఖ్య అతిథులుగా హాజరై మాట్లాడారు. కార్యాలయాల్లో అభద్రతాభావం లేకుండా పనిచేయాలన్నారు. ఉద్యోగపరంగా ఎలాంటి సమస్యలు ఉన్నా తమ దృష్టికి తీసుకు వస్తే పరిష్కారానికి చొరవ తీసుకుంటామన్నారు. వీరి ప్రసంగాన్ని డెఫ్ మహిళలకు ఇంటర్ర్పెటర్ యు.రామకృష్ణ సైగల ద్వారా వివరించారు. కార్యక్రమంలో డెఫ్ కమ్యూనిటీ టీమ్ హేమలత, మేరీఎవన్స్, రంగమ్మ, లావణ్య, మౌనిక, తిప్పమ్మ, తదితరులు పాల్గొన్నారు.
ఏపీ జేఏసీ అమరావతి చైర్మన్ దివాకర్రావు