● మాజీ మంత్రి సాకే శైలజానాథ్
అనంతపురం కార్పొరేషన్: అకాల వర్షాలు, ఈదురు గాలులతో తీవ్రంగా నష్టపోయిన రైతాంగానికి నష్టపరిహారం అందించి ఆదుకోవాలని మాజీ మంత్రి, వైఎస్సార్ సీపీ నేత డాక్టర్ సాకే శైలజానాథ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆదివారం ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. శింగనమల నియోజకవర్గంలోని పుట్లూరు, యల్లనూరు ప్రాంతాల్లో రైతులకు పెద్ద ఎత్తున నష్టం వాటిల్లిందన్నారు. పరిహారంతో పాటు మొక్కలను అందించేలా సీఎం చంద్రబాబు చర్యలు తీసుకోవాలన్నారు. రైతాంగాన్ని నిర్లక్ష్యం చేస్తే ఏమాత్రం ఉపేక్షించేది లేదని, ప్రజాస్వామ్య పద్ధతిలో ప్రభుత్వానికి బుద్ధి చెబుతామని హెచ్చరించారు.