కుందుర్పి: కొలిమిపాళ్యం సమీపంలోని సర్కారు చింతతోపు సర్వేనంబర్ 70–1, 70–2లో గల స్థలంలో టీడీపీ నాయకులు గుడిసెలు వేయించారు. ఎంపీపీ కమలమ్మ, సర్పంచ్ గంగాధర తదితరులు అడ్డగించే ప్రయత్నం చేయగా ‘మా ప్రభుత్వం.. మా ఇష్టం’ అంటూ 12 మంది టీడీపీకి చెందిన వారు స్థలాలు ఆక్రమించారు. మొదట గుడిసెలు వేసి తమవశం చేసుకోవాలని కుయుక్తులు పన్నుతున్నారని ఎంపీపీ, సర్పంచ్ తెలిపారు. ఈ విషయమై తహసీల్దార్ శ్రీనివాసులు మాట్లాడుతూ గుడిసెలు వేసిన ప్రభుత్వ స్థలాన్ని శనివారం పరిశీలించామని, గ్రామంలో ఇరు వర్గాలవారు గుడిసెలు వేశారని, వారితో మాట్లాడామని చెప్పారు. స్వచ్ఛందంగా తీసేయకపోతే, తాము సోమవారం తొలగిస్తామని స్పష్టం చేశారు.