నేత్రపర్వం.. శ్రీవారి అలుకోత్సవం | - | Sakshi
Sakshi News home page

నేత్రపర్వం.. శ్రీవారి అలుకోత్సవం

Mar 22 2025 1:24 AM | Updated on Mar 22 2025 1:21 AM

కదిరి: బ్రహ్మోత్సవాల్లో భాగంగా శుక్రవారం ఖాద్రీ లక్ష్మీ నరసింహస్వామి అలుకోత్సవం భక్తి శ్రద్ధలతో నేత్రపర్వంగా సాగింది. అనంతరం స్వామివారు అశ్వవాహనంపై తిరువీధుల్లో భక్తులకు దర్శనమిచ్చారు. అంతకుముందు అర్చకులు యాగశాలలో నిత్యహోమం నిర్వహించారు. అనంతరం శ్రీవారికి విశేషాలంకరణ చేసి ఆలయానికి సమీపంలో ఉన్న సుద్దుల మండపం వద్దకు తీసుకువచ్చారు. ఆనవాయితీ ప్రకారం అలుకోత్సవం ఉభయదారులుగా వ్యవహరించిన ఆలయ సహాయ కమిషనర్‌ వెండిదండి శ్రీనివాసరెడ్డి దంపతులు శ్రీవారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. ఈ సందర్భంగా అర్చక పండితులు బ్రహ్మోత్సవాలు, అలుకోత్సవ విశిష్టతను భక్తులకు వివరించారు. ఆలయ ప్రాంగణంలో భక్తుల కాలక్షేపం కోసం ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement