వృద్ధురాలిపై దాడి | - | Sakshi
Sakshi News home page

వృద్ధురాలిపై దాడి

Mar 21 2025 1:36 AM | Updated on Mar 21 2025 1:31 AM

గుత్తి రూరల్‌: మండలంలోని బాచుపల్లి గ్రామానికి చెందిన వృద్ధురాలు మారెమ్మపై అదే గ్రామానికి చెందిన ఐదుగురు గురువారం దాడి చేసి గాయపరిచారు. గ్రామంలోని జంగాల కాలనీకి చెందిన మారెమ్మ కుటుంబ సభ్యులతో పొరుగింటి వారికి విభేదాలు ఉన్నాయి. ఈ క్రమంలో గురువారం రెండు కుటుంబాల మధ్య ఘర్షణ తలెత్తడంతో మాటామాటా పెరిగి మారెమ్మపై విచక్షణారహితంగా దాడి చేశారు. గాయపడిన మారెమ్మను కుటుంబసభ్యులు వెంటనే చికిత్స నిమిత్తం గుత్తిలోని ప్రభుత్వాస్పత్రికి తీసుకెళ్లారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.

పీఎం యోగా అవార్డుకు దరఖాస్తులు

అనంతపురం కల్చరల్‌: ప్రధానమంత్రి యోగా అవార్డుకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు జిల్లా యువజన సంక్షేమశాఖ అధికారి ఎన్‌.వెంకటేశ్వర్లు తెలిపారు. యోగా ప్రచారం, అభివృద్ధి కోసం విశేషంగా కృషి చేస్తున్న వారు అర్హులన్నారు. కనీసం 40 ఏళ్ల లోపు ఉండాలన్నారు. ఈనెల 31లోపు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుందన్నారు. మరిన్ని వివరాలకు httpsIIin nvateindia.mygov.inIpm-yoga-aw ards-25వెబ్‌సైట్‌ చూడాలని సూచించారు.

హిందీ అమలు

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల బాధ్యత

డీఆర్‌ఎం చంద్రశేఖర్‌గుప్తా

గుంతకల్లు: రాజభాష హిందీని అమలు చేయడం బాధ్యతగా తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు డీఆర్‌ఎం చంద్రశేఖర్‌గుప్తా పిలుపునిచ్చారు. రాజభాష అమలుల్లో ప్రతిభ కనబరిచిన దాదపు 51 మంది ఉద్యోగులకు గురువారం ఆయన ప్రశంసా ప్రతాలను అందజేసి, అభినందించారు. రాజభాషా నియమాలను అనుసరించి ఉద్యోగులు తమ కార్యాలయాల్లో విధి నిర్వహణలో తప్పనిసరిగా హిందీ మాట్లాడం అలవాటు చేసుకోవాలన్నారు. కార్యక్రమంలో ఏడీఆర్‌ఎం సుధాకర్‌, చీఫ్‌ ప్రాజెక్ట్‌ మేనేజర్‌ రామకృష్ణ, డివిజన్‌ రాజభాష అధికారి ఆశా మహేష్‌కుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement