చేయని పనుల బిల్లుల కోసం సర్పంచ్‌ దౌర్జన్యం | - | Sakshi
Sakshi News home page

చేయని పనుల బిల్లుల కోసం సర్పంచ్‌ దౌర్జన్యం

Mar 19 2025 1:46 AM | Updated on Mar 19 2025 1:46 AM

చేయని

చేయని పనుల బిల్లుల కోసం సర్పంచ్‌ దౌర్జన్యం

సచివాలయ కార్యాలయానికి తాళం వేసి నిరసన పేరుతో హైడ్రామా

గుంతకల్లు రూరల్‌: మండలంలోని నక్కనదొడ్డి గ్రామ పంచాయతీ సర్పంచ్‌ (టీడీపీ మద్దతు) వరలక్ష్మి హైడ్రామాకు తెరలేపారు. చేయని పనులకు బిల్లులు చేయాలంటూ అధికారులపై ఒత్తిడి తీసుకెళ్లడమే కాక సచివాలయానికి మంగళవారం తాళం వేసి భర్త బొజ్జానాయక్‌, తన వర్గీయులతో కలసి నిరసన వ్యక్తం చేశారు. పంచాయతీ కార్యదర్శి వైఖరితో పంచాయతీ పరిధిలో అభివృద్ధి కుంటు పడుతోందని ఈ సందర్భంగా ఆమె ఆరోపించారు. గ్రామంలో రోడ్లు, కాలువలు, స్ట్రీట్‌ లైట్లు, పారిశుద్ధ్యం తదితర అనేక సమస్యలు తలెత్తుతున్నాయని, వీటి పరిష్కారానికి చర్యలు చేపట్టాలని పంచాయతీ కార్యదర్శి సుమలతకు పలుమార్లు చెప్పినా ఆమె పట్టించుకోవడం లేదన్నారు. పైగా గ్రామ పంచాయతీ నిధులు రూ.75 లక్షలు కాజేసినట్లు తమపై దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. అవినీతి జరిగినట్లుగా నిరూపించాలని సవాల్‌ చేశారు. ఈ విషయంపై ఈఓఆర్డీ నాగభూషణం, గ్రామ పంచాయతీ కార్యదర్శి సుమలత మాట్లాడుతూ... గ్రామంలో పూర్తి చేసిన ప్రతి అభివృద్ధి పనికీ ఇప్పటి వరకూ బిల్లులు చేశామన్నారు. కలెక్టర్‌ ఆదేశాల మేరకు వాటర్‌మెన్‌, పారిశుధ్య కార్మికుల బిల్లులు కూడా పెట్టామన్నారు. అయితే చేయని పనులకు బిల్లులు పెట్టమని సర్పంచ్‌, ఆమె భర్త డిమాండ్‌ చేస్తున్నారని, ఇలా బిల్లులు పెట్టడం కుదరదని చెప్పినందుకు అక్కసుతో హైడ్రామాకు తెరలేపారని వివరించారు. పాలకుల తీరుతో ఉద్యోగులు అభద్రతా భావంతో విధులు నిర్వర్తించాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు.

జెడ్పీలో పదోన్నతులకు సన్నాహాలు

అనంతపురం సిటీ: జిల్లా పరిషత్‌ పరిధిలో పని చేస్తున్న పలువురు ఉద్యోగులకు పదోన్నతులు కల్పించేందుకు రంగం సిద్ధమైంది. సీఈఓ రామచంద్రారెడ్డి, డిప్యూటీ సీఈఓ జి.వెంకటసుబ్బయ్య ఆధ్వర్యంలో జెడ్పీలోని ప్రత్యేక బృందం సీనియారిటీ జాబితా రూపకల్పనలో నిమగ్నమైంది. జిల్లా పరిషత్‌ కార్యాలయంతో పాటు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా మండల పరిషత్‌ కార్యాలయాలు, ఉన్నత పాఠశాలలు, పంచాయతీరాజ్‌, ఆర్‌డబ్ల్యూఎస్‌ ఇంజినీరింగ్‌ విభాగాల్లో పని చేస్తున్న జూనియర్‌ అసిస్టెంట్లు, రికార్డు అసిస్టెంట్లు, ల్యాబ్‌ అసిస్టెంట్లకు పదోన్నతులు కల్పించనున్నారు. తొలుత సీనియారిటీ, రోస్టర్‌ ప్రకారం ముసాయిదా జాబితా తయారు చేసి సీఈఓ పరిశీలన అనంతరం అభ్యంతరాలు స్వీకరిస్తారు. అభ్యంతరాలు లేవనిపిస్తే.. తుది జాబితాను సిద్ధం చేసి చైర్‌పర్సన్‌ బోయ గిరిజమ్మ ఆమోదంతో అర్హులైన వారికి పదోన్నతులు కల్పించి పోస్టింగ్‌లు ఇస్తారు.

చేయని పనుల బిల్లుల కోసం సర్పంచ్‌ దౌర్జన్యం 1
1/1

చేయని పనుల బిల్లుల కోసం సర్పంచ్‌ దౌర్జన్యం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement