బస్టాండ్‌లో బంగారు నగల అపహరణ | - | Sakshi
Sakshi News home page

బస్టాండ్‌లో బంగారు నగల అపహరణ

Mar 18 2025 12:21 AM | Updated on Mar 18 2025 12:20 AM

గుత్తి: స్థానిక ఆర్టీసీ బస్టాండ్‌లో ప్రయాణికురాలి బ్యాగ్‌లోని బంగారు నగలను దుండగులు అపహరించారు. పోలీసులు తెలిపిన మేరకు... గుత్తి పట్టణానికి చెందిన శ్రావణి, మధుమోహన్‌ దంపతులు ఆదివారం యాడికిలో జరుగుతున్న చెన్నకేశవస్వామి బ్రహ్మోత్సవాలకు వెళ్లారు. రాత్రికి తిరుగు ప్రయాణమై గుత్తి బస్టాండ్‌లో బస్సు దిగారు. ఆ సమయంలో శ్రావణి బ్యాగులోని 10 తులాల బంగారు నెక్లెస్‌, లాంగ్‌ చైన్‌, కమ్మలను దుండుగులు అపహరించారు. ఆలస్యంగా విషయాన్ని గుర్తించిన బాధిత దంపతులు చుట్టుపక్కల ఆరా తీసినా ఫలితం లేకపోయింది. సోమవారం ఉదయం ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేసి, బస్టాండ్‌లోని సీసీ కెమెరా ఫుటేజీల ఆధారంగా దర్యాప్తు చేపట్టారు.

జాతీయస్థాయి

కబడ్డీ పోటీలకు ఆర్షియా

తాడిపత్రి టౌన్‌: జాతీయ స్థాయి కబడీ పోటీలకు తాడిపత్రిలోని సాయిచైతన్య స్కూల్‌ విద్యార్థి ఆర్షియా ఎంపికై ంది. ఈ మేరకు ఆ పాఠశాల కరస్పాండెంట్‌ లక్ష్మీనరసింహ సోమవారం తెలిపారు. ఈ నెల 16న పులివెందులలో జరిగిన రాష్ట్ర స్థాయి కబడ్డీ పోటీల్లో ఆర్షియ ప్రతిభ కనబరిచి జాతీయ స్థాయి పోటీల్లో ప్రాతినిథ్యం వహించే ఏపీ జట్టులో చోటు దక్కించుకుందన్నారు. ఈ సందర్భంగా ఆర్షియను పాఠశాల ఉపాధ్యాయులు, విధ్యార్థులు అభినందించారు.

కార్యాచరణ ప్రణాళిక

సిద్ధం చేయండి

అధికారులకు కలెక్టర్‌ ఆదేశం

అనంతపురం అర్బన్‌: ఇటీవల జరిగిన హార్టికల్చర్‌ కాంక్లేవ్‌లో చేసుకున్న ఎంఓయూలకు సంబంధించి రాబోయే మూడు నెలల్లో చేపట్టాల్సిన కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేయాలని సంబంధిత అధికారులను కలెక్టర్‌ వి.వినోద్‌కుమార్‌ ఆదేశించారు. ఎంఓయూల అంశంపై సోమవారం కలెక్టరేట్‌ నుంచి ఉద్యాన శాఖ అధికారులు, కంపెనీల ప్రతినిధులతో వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా కలెక్టర్‌ సమీక్షించారు. కాంక్లేవ్‌లో ఏడు ఎంఓయూలు జరిగాయన్నారు. వీటికి సంబంధించి రాబోయే మూడు నెలలకు కార్యాచరణ ప్రణాళికను ఆయా కంపెనీల ప్రతినిధులు వారంలోపు అందజేయాలన్నారు. కాన్ఫరెన్స్‌లో ఉద్యాన శాఖ అధికారి నరసింహారావు, టెక్నికల్‌ అధికారి పల్లవి, ఇతర అధికారులు పాల్గొన్నారు.

బస్టాండ్‌లో  బంగారు నగల అపహరణ 1
1/1

బస్టాండ్‌లో బంగారు నగల అపహరణ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement