ఉరవకొండ: బ్రహ్మోత్సవాల్లో భాగంగా గవిమఠం చంద్రమౌళీశ్వరస్వామి శుక్రవారం ఐరావత వాహనంపై భక్తులకు శుక్రవారం దర్శనిమిచ్చారు. ఉదయం స్వామి వారికి మహారుద్రాభిషేకం, మంగళహారతి కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం గవిమఠం ఉత్తరాధికారి డాక్టర్ కరిబసవ రాజేంద్రస్వామి, ఆదోని చౌకి మఠం పీఠాధిపతి కళ్యాణస్వామిజీ, మఠం సహాయ కమిషనర్ కె.రాణి ఆధ్వర్యంలో చంద్రమౌళీశ్వరస్వామి మూలవిరాట్ను ఊరేగింపుగా ప్రత్యేక వాహనం వద్దకు తీసుకొచ్చారు. అనంతరం ఐరావత వాహనంపై ఉత్సవమూర్తిని ఉంచి భక్తు లు ఊరేగించారు. కార్యక్రమంలో మఠం ఏజెంట్ రాజన్నగౌడ్, మఠం జూనియర్ అసిస్టెంట్లు గోపి, నారాయణస్వామి, వీర సంక్షేమ సంఘం నాయకులు పాటిల్ నిరంజన్గౌడ్ పాల్గొన్నారు.