భర్త అకాల మరణం.. చుట్టుముట్టిన అప్పులు.. అయినా ఆమె వెరవలేదు. వ్యవసాయంలో రాణిస్తూ కష్టాలను అధిగమిస్తూ కూతురికి ఉజ్వల భవిష్యత్తు అందించడం కోసం పోరాడుతోంది. వజ్రకరూరు మండలం పాతకడమలకుంట గ్రామానికి చెందిన సత్యనారాయణ, లలిత దంపతులు. వీరికి ఒక కుమార్తె ఉంది. తమకున్న ఐదెకరాల్లో వ్యవసాయం చేసుకుంటూ కూతురును చదవించేవారు. నాలుగేళ్ల క్రితం కుమార్తె దీవెన ఎంబీబీఎస్లో చేరింది. ఏడాది తిరిగేలోపే సత్యనారాయణ అనారోగ్యం బారినపడ్డాడు. అప్పులు చేసి రూ.40లక్షలు వెచ్చించి వైద్యం చేయించినా ఫలితం లేకపోయింది. సత్యనారాయణ చనిపోయాడు. కూతురి ఎంబీబీఎస్ చదువు ఆగిపోయింది. అయితే లలిత మరికొంత భూమి కౌలుకు తీసుకుని వ్యవసాయం చేస్తూ తన కుతూరు భవిష్యత్తు కోసం బయో మెడికల్ ఇంజినీరింగ్ కోర్సులో చేర్పించింది. – ఉరవకొండ:
కూతురి భవిత కోసం పోరాటం