బీఎస్సీ నర్సింగ్‌ విద్యార్థులకు ఉద్యోగావకాశాలు | - | Sakshi
Sakshi News home page

బీఎస్సీ నర్సింగ్‌ విద్యార్థులకు ఉద్యోగావకాశాలు

Nov 18 2024 2:54 AM | Updated on Nov 18 2024 2:54 AM

బీఎస్సీ నర్సింగ్‌ విద్యార్థులకు ఉద్యోగావకాశాలు

బీఎస్సీ నర్సింగ్‌ విద్యార్థులకు ఉద్యోగావకాశాలు

అనంతపురం: జనరల్‌ నర్సింగ్‌ మిడ్వైఫరీ(జీఎన్‌ఎం), బీఎస్సీ నర్సింగ్‌ పూర్తి చేసిన నిరుద్యోగ యువతకు జర్మనీలో ఉద్యోగావకాశాలు కల్పించనున్నారు. ఈమేరకు జిల్లా నైపుణ్యాభివృద్ధి సంస్థ అధికారి పీవీ ప్రతాప్‌ రెడ్డి శనివారం ఓ ప్రకటన విడుదల చేశారు. జర్మన్‌ లాంగ్వేజ్‌పై శిక్షణ ఇచ్చిన అనంతరం ఉద్యోగం కల్పిస్తామని తెలిపారు. ఇందుకోసం రూ.75 వేలు కాషన్‌ డిపాజిట్‌ చెల్లించడంతోపాటు ఒరిజినల్‌ సర్టిఫికెట్లు సమర్పించాల్సి ఉంటుందని పేర్కొన్నారు. రెసిడెన్షియల్‌ శిక్షణతోపాటు ఉద్యోగానికి ఎంపికై న అభ్యర్థులకు వీసా ఫీజు, రానుపోను విమాన టిక్కెట్లు చెల్లిస్తామని తెలిపారు. జర్మనీలో సుమారు రూ.2,33 లక్షల నుంచి 3,26,000(2400 యూరోల నుంచి 3500 యూరోల వరకు) వరకు వేతనం చెల్లిస్తారని పేర్కొన్నారు. వివరాలకు 99888 53335 నంబరులో సంప్రదించాలని సూచించారు.

హోటల్‌ సిబ్బందిపై దాడి

పెద్దవడుగూరు : మిడుతూరు సమీపంలోని ఓ హోటల్‌ సిబ్బందిపై మరో హోటల్‌ యజమానులు దాడి చేశారు. పోలీసులు తెలిపిన వివరాలు..రాత్రి సమయాల్లో సుదూర ప్రాంతాలకు ప్రయాణిలకుతో వెళ్లే బస్సులు భోజనం కోసం ఆపే విషయంలో ఆమోఘ్‌, రవితేజ్‌ హోటళ్ల నిర్వాహకుల మధ్య కొన్నేళ్లుగా మనస్పర్థలున్నాయి. ఇదే విషయమై శుక్రవారం రాత్రి మిడుతూరు సమీపంలోని అమోఘ్‌ హోటల్‌ సిబ్బందిపై రవితేజ హోటల్‌ యజమానులు నారాయణస్వామి, రవితేజ దాడి చేశారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ ఆంజనేయులు తెలిపారు.

గొర్రెల కాపరిపై ..

గార్లదిన్నె: గొర్రెల మేపు విషయంలో ట్రాక్టర్‌ నగర్‌ సిబ్బంది గొర్రెల కాపరిపై దాడి చేశారు. బాధితుడి వివరాల మేరకు..శింగనమల మండలం వెస్ట్‌ నరసాపురానికి చెందిన గొర్రెల కాపరి నగేష్‌ ట్రాక్టర్‌ నగర్‌ సమీపంలోని దండకొండలో శనివారం గొర్రెలను మేపు కోసం తోలుకెళ్లాడు. నలుగురు ట్రాక్టర్‌ నగర్‌ సిబ్బంది అక్కడకు వచ్చి కొండలో గొర్రెలు మేపరాదని వాదనకు దిగడంతోపాటు అతడిపై కట్టెలతో దాడి చేశారు. తలకు గాయం కావడంతో వెంటనే అతడు కుటుంబ సభ్యులు అక్కడికి చేరుకున్నారు. అనంతరం 108 వాహనంలో అనంతపురం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఈ మేరకు బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

యువకుడు ఆత్మహత్య

ఆత్మకూరు: వడ్డుపల్లిలో ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఎస్‌ఐ లక్ష్మీనారాయణ తెలిపిన వివరాలు.. గ్రామానికి చెందిన భగమంతు, ఈశ్వరమ్మకు ఇద్దరు కుమారులు, కుమార్తె ఉన్నారు. చిన్న కుమారుడు మీనుగ ఇంద్ర(21) విద్యుత్‌ కూలీ పనులు చేసేవాడు. ఇతడు ఏడాది నుంచి కడుపునొప్పితో బాధపడేవాడు. చికిత్స తీసుకున్నప్పటికీ ఫలితం లేకపోయింది. శనివారం ఇంట్లో ఫ్యాన్‌కు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ తెలియజేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement