రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి | - | Sakshi
Sakshi News home page

రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి

Dec 11 2023 12:44 AM | Updated on Dec 11 2023 12:44 AM

ఆంజనేయులు మృతదేహం 
 - Sakshi

ఆంజనేయులు మృతదేహం

గుంతకల్లు రూరల్‌: ద్విచక్ర వాహనం వెనుక నుంచి ఢీకొన్న ఘటనలో మరో బైక్‌పై వెళుతున్న ఓ వ్యక్తి దుర్మరణం పాలయ్యాడు. పోలీసులు తెలిపిన మేరకు... గుంతకల్లు మండలం దంచర్లకు చెందిన ఆంజనేయులు (52), పాతకొత్తచెరువు నివాసి బాలకృష్ణ గొర్రెల పోషణతో జీవనం సాగిస్తున్నారు. ఈ క్రమంలో ఇద్దరూ ఆదివారం రాత్రి ద్విచక్ర వాహనంపై గుత్తి వైపుగా గొర్రెల మంద వద్దకు వెళుతుండగా పాతకొత్తచెరువు దాటగానే వెనక నుంచి వేగంగా దూసుకొచ్చిన మరో బైకు ఢీకొంది. ఘటనలో ఆంజనేయులు, బాలకృష్ణ రోడ్డుపై పడ్డారు. తలకు తీవ్ర గాయమై ఆంజనేయులు అక్కడికక్కడే మృతి చెందాడు. తీవ్రంగా గాయపడిన బాలకృష్ణను గుంతకల్లు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కాగా, ప్రమాదానికి కారణమైన ద్విచక్ర వాహనదారుడు తన వాహనాన్ని అక్కడే వదిలేసి పరారయ్యాడు. ఆంజనేయులకు భార్య మహాలక్ష్మి, ఓ కుమార్తె, కుమారుడు ఉన్నారు. కేసు నమోదు చేసిన పోలీసులు ప్రమాదానికి కారణమైన బైక్‌ నంబర్‌ ఆధారంగా దర్యాప్తు చేపట్టారు.

మరొకరికి తీవ్రగాయాలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement