అనంతపురం సిటీ: ఉమ్మడి అనంతపురం జిల్లా పరిషత్ స్థాయీ సంఘ సమావేశాలు వచ్చే నెల 5, 6 తేదీల్లో నిర్వహించనున్నారు. 5న స్థాయీ సంఘం–1, 3, 7 సమావేశాలు జెడ్పీ చైర్పర్సన్ గిరిజమ్మ, ఇన్చార్జ్ సీఈఓ కేతన్గార్గ్ ఆధ్వర్యంలో నిర్వహిస్తారు. 6న స్థాయీ సంఘం–2, 4, 5, 6 (గ్రామీణాభివృద్ధి/ విద్య, వైద్యం/ సీ్త్ర, శిశు సంక్షేమం/ సాంఘిక సంక్షేమ శాఖలు) సమావేశాలు డిప్యూటీ సీఈఓ లలితాబాయి ఆధ్వర్యంలో ఆయా స్థాయీ సంఘం అధ్యక్షుల అధ్యక్షతన నిర్వహించనున్నారు. గత సమావేశాల్లో సభ్యులు లేవనెత్తిన అంశాలు, వాటిపై తీసుకున్న చర్యల గురించి అధికారులు సమగ్ర సమాచారంతో సమావేశాలకు హాజరు కావాలని ఉన్నతాధికారులు ఆదేశించారు.