పట్టుబడ్డ వ్యక్తులు, నగదు, కోళ్లు, సెల్ఫోన్లు
పాయకరావుపేట : మండలంలో గల ఈదటం గ్రామ శివారులో 9 మంది వ్యక్తులు కోడి పందాలు ఆడుతున్నట్టు సీఐ జి.అప్పన్నకు అందిన సమాచారం మేరకు ఎస్ఐ పురుషోత్తం, సిబ్బంది దాడి జరిపి పట్టుకున్నారు. వారి వద్ద రూ.3230 నగదు, 3 బతికిన కోళ్లు, 3 చనిపోయిన కోళ్లు, 9 సెల్ఫోన్లు, 5 మోటారు సైకిళ్లు సీజ్ చేసి, కేసు నమోదు చేసినట్టు తెలిపారు. కోడి పందాలు, రబ్బరు గుండాట, పేకాట ఆడుతున్నట్టు సమాచారం అందితే కఠిన చర్యలు తీసుకుంటామని సీఐ తెలిపారు.


