వీడియో కాన్ఫరెన్స్లో కలెక్టర్, జేసీ
కలెక్టర్ల చర్చా కార్యక్రమంలో వర్చువల్గా హాజరైన కలెక్టర్ విజయకృష్ణన్, జేసీ శౌర్యమాన్ పటేల్
తుమ్మపాల: గేట్స్ ఫౌండేషన్ చైర్మన్ బిల్గేట్స్ అమరావతి పర్యటనలో భాగంగా సోమవారం ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ స్వర్ణాంధ్ర 2047 విజన్లో భాగంగా సంజీవని ప్రాజెక్ట్, కృత్రిమ మేధస్సు (ఏఐ) ఆధారిత వ్యవసాయం, విద్యా, ఆరోగ్య రంగాల్లో చేపట్టిన ప్రాజెక్టులపై వీడియో కాన్ఫరెన్స్ ద్వారా వర్చువల్గా నిర్వహించిన కలెక్టర్ల చర్చా కార్యక్రమంలో జిల్లా నుంచి కలెక్టర్ విజయకృష్ణన్, జాయింట్ కలెక్టర్ శౌర్యమాన్ పటేల్ హాజరయ్యారు. ఆర్టీజీఎస్ ద్వారా ప్రజలకు అందిస్తున్న సేవలను గురించి వివరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ముఖ్య ప్రణాళిక అధికారి జి.రామారావు, ఇతర అఽధికారులు పాల్గొన్నారు.


