‘పది’ పరీక్షలకువందరోజుల ప్రణాళిక
అనకాపల్లి టౌన్ : రానున్న పదో తరగతి పరీక్ష ఫలితాలలో శత శాతం ఉత్తీర్ణత సాధించాలని జిల్లా విద్యాశాఖాధికారి గిడ్డి అప్పారావు నాయుడు అన్నారు. స్ధానిక ఉడ్పేట పాఠశాలలో జరిగిన కార్యక్రమంలో పదో తరగతి పరీక్షల 100 రోజులు ప్రణాళిక పుస్తకం ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి విద్యార్థికి ఈ బుక్లో ఉన్న సిల్బస్ను బోధించాలన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా పదో తరగతి పరీక్షల పరిశీలకుడు శ్రీధర్ రెడ్డి, ఎంఈవో ఎస్.కోటేశ్వరావు, సీసీ వెంకటేశ్వరావు పాల్గొన్నారు.


