
నేడు వైఎస్సార్సీపీ జిల్లా విస్తృత స్థాయి సమావేశం
● ముఖ్యఅతిథులుగా శాసనమండలి విపక్ష నేత బొత్స, రీజినల్ కోఆర్డినేటర్ కురసాల కన్నబాబు ● జిల్లాలో కేడరంతా హాజరు కావాలని అమర్నాథ్ పిలుపు
సాక్షి, విశాఖపట్నం:
పార్టీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్రెడ్డి ఆదేశాల మేరకు శనివారం మధ్యా హ్నం 3 గంటలకు వైఎస్సార్సీపీ జిల్లా విస్తృత స్థాయి సమావేశం జరగనుంది. జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ ఆధ్వర్యంలో అనకాపల్లి టౌన్లోని పెంటకోట కన్వెన్షన్ హాల్లో నిర్వహించే ఈ కార్యక్రమానికి శాసన మండలి విపక్ష నేత బొత్స సత్యనారాయణ, ఉత్తరాంధ్ర రీజినల్ కోఆర్డినేటర్ కురసాల కన్నబాబు, పీఏసీ కమిటీ సభ్యుడు బూడి ముత్యాలనాయుడు, పార్లమెంట్ సమన్వయకర్త, నియోజకవర్గ సమన్వయకర్తలు హాజరు కానున్నారు. ఈ సందర్భంగా పార్టీ జిల్లా అధ్యక్షుడు అమర్నాథ్ మాట్లాడుతూ ఏడాది కూటమి పాలనలో ఇచ్చిన హామీలను అమలు చేయకుండా చేసిన మోసాలను గడప గడపకు వెళ్లి ఎండగట్టేందుకు నిర్వహించే ‘బాబు షూరిటీ..మోసాలు గ్యారెంటీ’ పేరిట వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టామన్నారు. ఆరు వారాల పాటు జిల్లా, మండల, గ్రామ స్థాయుల్లో ప్రజల వద్దకే వెళ్లి క్యూఆర్ కోడ్ ద్వారా కూటమి మేనిఫెస్టోలో ఏమైతే హామీలు ఇచ్చారో.. వాటిలో ఏ పథకాలు ఇచ్చారో.. ఎన్ని ఎగవేశారో స్పష్టంగా తెలియజేస్తామన్నారు. క్యూఆర్ కోడ్ ద్వారా 2024 ముందు కూటమి పార్టీలు ఇచ్చిన మేనిఫెస్టోను డౌన్లోడ్ చేసుకునే విధంగా టెక్నాలజీ కల్పించామన్నారు. ఈ సమావేశానికి జిల్లాలో అన్ని నియోజకవర్గాల్లో జెడ్పీటీసీలు, పార్టీ మండల అధ్యక్షులు, ఎంపీపీలు, జిల్లా అనుబంధ విభాగాల అధ్యక్షులు, ఎంపీటీసీలు, సర్పంచ్లు, కార్యకర్తలు హాజరు కావాలని పిలుపునిచ్చారు.