
బీకాం టాపర్కు సీపీఎం నేతల సన్మానం
గొలుగొండ: ఆదీవాసీ గిరిజన యువకుడు దుర్గాప్రసాద్ బీకాంలో యూనివర్శిటీ ప్రథమ స్థానం సాధించడంతో సీపీఎం నేతలు బుధవారం గ్రామంలో సత్కరించారు. పాతమల్లంపేట పంచాయతీ శివారు గిరిజన గ్రామం అయిన ఎన్. గదబపాలెం గ్రామానికి చెందిన చీమల దుర్గాప్రసాద్ నర్సీపట్నంలో అల్లూరి సీతారామరాజు డిగ్రీ కళాశాలలో బీకాం చదివాడు. ఇటీవల ఫలితాల్లో ఆంధ్రయూనివర్సిటీ బీకాంలో ప్రథమ స్థానం సాధించడంతో అతనికి సీపీఎం నేతలు అభినందనలు తెలిపారు. దుర్గాప్రసాద్ గిరిజన యువకులకు ఆదర్శంగా నిలుస్తాడన్నారు. కార్యక్రమంలో సీపీఎం నేతలు నారాయణమూర్తి, అడిగర్ల రాజు, గొర్రి శివ, చీమల రాము, లక్ష్మణ్ పాల్గొన్నారు.