బీకాం టాపర్‌కు సీపీఎం నేతల సన్మానం | - | Sakshi
Sakshi News home page

బీకాం టాపర్‌కు సీపీఎం నేతల సన్మానం

Jun 5 2025 8:10 AM | Updated on Jun 5 2025 8:10 AM

బీకాం టాపర్‌కు సీపీఎం నేతల సన్మానం

బీకాం టాపర్‌కు సీపీఎం నేతల సన్మానం

గొలుగొండ: ఆదీవాసీ గిరిజన యువకుడు దుర్గాప్రసాద్‌ బీకాంలో యూనివర్శిటీ ప్రథమ స్థానం సాధించడంతో సీపీఎం నేతలు బుధవారం గ్రామంలో సత్కరించారు. పాతమల్లంపేట పంచాయతీ శివారు గిరిజన గ్రామం అయిన ఎన్‌. గదబపాలెం గ్రామానికి చెందిన చీమల దుర్గాప్రసాద్‌ నర్సీపట్నంలో అల్లూరి సీతారామరాజు డిగ్రీ కళాశాలలో బీకాం చదివాడు. ఇటీవల ఫలితాల్లో ఆంధ్రయూనివర్సిటీ బీకాంలో ప్రథమ స్థానం సాధించడంతో అతనికి సీపీఎం నేతలు అభినందనలు తెలిపారు. దుర్గాప్రసాద్‌ గిరిజన యువకులకు ఆదర్శంగా నిలుస్తాడన్నారు. కార్యక్రమంలో సీపీఎం నేతలు నారాయణమూర్తి, అడిగర్ల రాజు, గొర్రి శివ, చీమల రాము, లక్ష్మణ్‌ పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement